Nagma : అలనాటి అందాల తార నగ్మా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన అలరించిన నగ్మా రాజకీయాలలోను రాణిస్తోంది. అయితే చివరిసారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అల్లరి రాముడు సినిమాలో అత్త పాత్రలో నటించింది. కేవలం తెలుగు భాషలోనే కాకుండా తమిళ భాషలో కూడా నటించి నంబర్ వన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు.
నగ్మా వయస్సు 45 సంవత్సరాలు అయినా కూడా ఆమె ఇప్పటికీ వివాహం చేసుకోలేదు. కానీ తన జీవితంలో చాలా మంది పురుషులతో సంబంధం కలిగి ఉన్నట్లు వార్తలు వినిపించాయి. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, నటి నగ్మా ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వినిపించాయి. సౌరవ్ గంగూలీతో విడిపోయిన అనంతరం ఆమె దక్షిణ భారత నటుడు అయిన శరత్ కుమార్ తో ప్రేమలో పడింది. శరత్ కుమార్ నగ్మాను కలిసినప్పటికీ అప్పటికే అతనికి వివాహం అయ్యింది.
దక్షిణ భారత సినిమాలకు వీడ్కోలు చెప్పిన తర్వాత నగ్మా ముంబైకి షిఫ్ట్ అయ్యింది. భోజ్ పురి చిత్రాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంది. అక్కడ సూపర్ స్టార్ రవి కిషన్ తో కలిసి పలు సినిమాల్లో నటించింది. ఇక ఆ తర్వాత అప్పటికే వివాహం అయిన రవి కిషన్ కు పడిపోయింది. రవి బిగ్ బాస్ మొదటి సీజన్ లో పాల్గొనడానికి వెళ్ళాడు. దీంతో వారి మధ్య దూరం ఏర్పడడంతో కొన్నేళ్ళ తర్వాత ఇద్దరు నటులు విడిపోయారు.
నగ్మా రవితో చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించిన తరువాత, భోజ్ పురి లో మరో నటుడైన మనోజ్ తివారితో ప్రేమలో పడింది. కానీ ఒక ఇంటర్వ్యూలో నగ్మా వారి మధ్య ఉన్న సంబంధాన్ని ఖండిస్తూ నేను అతనితో కలిసి పని చేస్తున్నాను, అంతే కానీ మా మధ్య ఎటువంటి సంబంధం లేదు, దయచేసి నన్ను విడిచి పెట్టండి.. అంటూ చెప్పుకొచ్చింది. ఏదేమైనా ఇప్పటికీ నగ్మా ప్రేమ వ్యవహారం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం మార్చి 8, 2026న జరగనున్న భారత్, న్యూజిలాండ్ టీ20 ప్రపంచ కప్ ఫైనల్…
నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ భార్య సంగీత చెంగల్ పట్టు జిల్లా కోర్టులో మరో కొత్త పిటిషన్ దాఖలు…
నటుడు అక్కినేని నాగచైతన్య తన భార్య శోభిత ధూళిపాళతో కలిసి ఒడిశాలోని పూరీలో ఉన్న సుప్రసిద్ధ పూరీ జగన్నాథున్ని దర్శించుకున్నారు.…
టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ లో భారత్ జట్టు న్యూజిలాండ్ తో మార్చి 8, 2026న తలపడనుంది. ఈ…
భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ 2 తర్వాత…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 13 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించనున్నట్లు ప్రకటించారు.…
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్ డిజిటల్ వీక్షణలో ప్రపంచ రికార్డు…
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం పాటించే ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా…