ఒకప్పుడు మన ఇండ్లలో చెక్కతో చేసిన కుర్చీలనే ఎక్కువగా వాడేవారు. కానీ ఇప్పుడు కుర్చీలు రూపాంతరం చెందాయి. ప్లాస్టిక్తో తయారు చేసిన కుర్చీలనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇవి ధర తక్కువగా ఉండడంతోపాటు తేలిగ్గా ఉంటాయి. ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లవచ్చు. విరిగిపోతే ఇబ్బంది ఉండదు. మళ్లీ కొత్త కుర్చీలను కొనవచ్చు. అందువల్ల ప్లాస్టిక్ కుర్చీలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే వీటిల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి రెగ్యులర్గా కూర్చునే కుర్చీలు కాగా.. ఇంకో రకమైనవి స్టూల్ రూపంలో ఉంటాయి. వీటిని కూర్చునేందుకు లేదా టీపాయ్ మాదిరిగా ఉపయోగిస్తారు. అయితే ఈ కుర్చీల మధ్యలో రంధ్రాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించే ఉంటారు. వీటిని ఎందుకు ఏర్పాటు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా కుర్చీలను ఒకదానిమీద ఒకటి పెట్టినప్పుడు వాటి మధ్యలో కొంత గాలి ఒత్తిడి ఏర్పడుతుంది. ఆ సమయంలో కుర్చీ మధ్యలో హోల్ లేకపోతే ఆ మధ్యన ఉండే గాలి వల్ల అవి చాలా టైట్ గా ఇరుక్కుపోతాయి. దీంతో వాటిని విడదీయడం కష్టంగా మారుతుంది. కనుకనే అలాంటి చెయిర్స్కు మధ్యలో రంధ్రాలను ఏర్పాటు చేస్తారు. ఇక కుర్చీలను తయారు చేసేటప్పుడు కొంత మెటీరియల్ ను పొదుపు చేయడం కోసం, తక్కువ ఖర్చులో కుర్చీని తయారు చేయడం కోసం ఈ రంధ్రాలను పెడతారు.
ఇక ఈ చెయిర్స్కు మధ్యలో రంధ్రాలు ఉండడం వల్ల వాటిని సులభంగా పట్టుకునేందుకు వీలవుతుంది. అలాగే వాటిని ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లవచ్చు. అలాగే చెయిర్స్కు మధ్యలో ఎల్లప్పుడూ రంధ్రాలను వృత్తాకారంలోనే ఏర్పాటు చేస్తారు. చతురస్రాకారంలో రంధ్రాలు ఉండవు. ఎందుకంటే చెయిర్ మీద కూర్చున్నప్పుడు మనం కలిగించే ఒత్తిడి ఆ రంధ్రం ద్వారా బయటకు గాలి రూపంలో పోతుంది. దీంతో చెయిర్ ఎక్కువ కాలం మన్నుతుంది. అదే రంధ్ర లేకపోతే అదే ప్రదేశంలో కొంత కాలానికి సులభంగా పగులు ఏర్పడుతుంది. దీంతో కుర్చీ త్వరగా విరిగిపోతుంది. అందుకనే చెయిర్కు మధ్యలో రంధ్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఇలా ఈ కుర్చీలకు మధ్యలో రంధ్రాలను ఏర్పాటు చేయడానికి వెనుక పలు కారణాలు ఉన్నాయని చెప్పవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…