Vodafone Idea : వొడాఫోన్ ఐడియా (వీఐ) తన వినియోగదారులకు షాకిచ్చింది. ప్రీపెయిడ్ చార్జిలను పెంచుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు వీఐ ఒక ప్రకటనను విడుదల చేసింది. అందులో బేస్ ప్లాన్ ధర రూ.99గా ఉంది. మిగిలిన అన్ని ప్లాన్లపై 25 శాతం చార్జిలను పెంచింది. అయితే బేస్ ప్లాన్లో ఎస్ఎంఎస్లను పంపుకునే వీలు లేదు. కనీసం నెలకు రూ.179 చెల్లిస్తే గానీ ఎస్ఎంఎస్లు పంపుకునే వీలు ఇకపై లేదు.
ఇక పెంచిన చార్జిల ప్రకారం వీఐ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ల వివరాలు ఇలా ఉన్నాయి. రూ.79, రూ.149, రూ.219, రూ.249, రూ.299, రూ.399, రూ.449, రూ.379, రూ.599, రూ.699, రూ.1499, రూ.2399 లకు కొత్త ప్లాన్లు లభిస్తున్నాయి. వీటి గురించిన పూర్తి వివరాలను కింద ఇచ్చిన చిత్రంలో చూసి తెలుసుకోవచ్చు.
ఇక రూ.48, రూ.98, రూ.251, రూ.351లకు డేటా టాపప్స్ను వొడాఫోన్ ఐడియా అందిస్తోంది. పెంచిన చార్జిలు నవంబర్ 25 నుంచి అమలులోకి రానున్నాయి. ఇప్పటికే ఎయిర్ టెల్ చార్జిలను పెంచగా, అదే బాటలో వీఐ కూడా చార్జిలను పెంచింది. అయితే రిలయన్స్ జియో ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…