Vodafone Idea : వొడాఫోన్ ఐడియా (వీఐ) తన వినియోగదారులకు షాకిచ్చింది. ప్రీపెయిడ్ చార్జిలను పెంచుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు వీఐ ఒక ప్రకటనను విడుదల చేసింది. అందులో బేస్ ప్లాన్ ధర రూ.99గా ఉంది. మిగిలిన అన్ని ప్లాన్లపై 25 శాతం చార్జిలను పెంచింది. అయితే బేస్ ప్లాన్లో ఎస్ఎంఎస్లను పంపుకునే వీలు లేదు. కనీసం నెలకు రూ.179 చెల్లిస్తే గానీ ఎస్ఎంఎస్లు పంపుకునే వీలు ఇకపై లేదు.
ఇక పెంచిన చార్జిల ప్రకారం వీఐ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ల వివరాలు ఇలా ఉన్నాయి. రూ.79, రూ.149, రూ.219, రూ.249, రూ.299, రూ.399, రూ.449, రూ.379, రూ.599, రూ.699, రూ.1499, రూ.2399 లకు కొత్త ప్లాన్లు లభిస్తున్నాయి. వీటి గురించిన పూర్తి వివరాలను కింద ఇచ్చిన చిత్రంలో చూసి తెలుసుకోవచ్చు.
ఇక రూ.48, రూ.98, రూ.251, రూ.351లకు డేటా టాపప్స్ను వొడాఫోన్ ఐడియా అందిస్తోంది. పెంచిన చార్జిలు నవంబర్ 25 నుంచి అమలులోకి రానున్నాయి. ఇప్పటికే ఎయిర్ టెల్ చార్జిలను పెంచగా, అదే బాటలో వీఐ కూడా చార్జిలను పెంచింది. అయితే రిలయన్స్ జియో ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…