Viral Video : సాధారణంగా ఇద్దరు లేక ముగ్గురు సైకిల్ మీద వెళ్లడం అనేదే కొంచెం కష్టమైన పని. అయితే ఒక వ్యక్తి మాత్రం ఏకంగా తొమ్మిది మంది పిల్లలను సైకిల్ పై ఎక్కించుకొని ప్రయాణం చేస్తున్నాడు. అంటే.. మొత్తం 10మంది ఆ సైకిల్ మీద ఉన్నట్టు అన్న మాట. ఇది అంత సింపుల్ విషయమా అన్నట్టుగా.. ఆ వ్యక్తి సైకిల్ నడపడటం వీక్షకులందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న విషయం. తొమ్మిది మంది పిల్లలను ఒకే సైకిల్పై ఎక్కించుకుని వెళ్తున్న ఆ వ్యక్తి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఈ చిన్న క్లిప్ను జైకీ యాదవ్ అనే వినియోగదారు తన ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ వీడియోలో, ఒక వ్యక్తి సైకిల్పై తొమ్మిది మంది పిల్లలను తీసుకువెళుతున్నాడు. ముగ్గురు పిల్లలు సైకిల్ వెనుక కూర్చొని ఉండగా, వారిలో ఒకరు ఇతరులపై నిలబడి వ్యక్తి భుజాలు పట్టుకుని కనిపించారు. ఇద్దరు పిల్లలు బైక్ ముందు బార్పై కూర్చొని ఉన్నారు. ఏడవ పిల్లవాడు ముందు చక్రంపైన వ్యక్తికి ఎదురుగా కూర్చొని ఉన్నాడు. మిగిలిన ఇద్దరు పిల్లలు రైడర్ యొక్క చేతుల్లో స్థిరపడి, సైకిల్ రైడ్ మొత్తం అతనిని పట్టుకొని కూర్చుని ఉన్నారు.
ఈ క్లిప్ మంగళవారం ట్విట్టర్ వేదికగా షేర్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఈ వీడియోకి 216,000 కంటే ఎక్కువ వీక్షణలను మరియు 7,200 కంటే ఎక్కువ లైక్లు వచ్చాయి. ఈ వీడియోని చూసిన నెటిజన్లు సైతం అనేక విధాలుగా స్పందించడం మొదలుపెట్టారు. ఒకే సైకిల్పై కూర్చున్న తొమ్మిది మంది పిల్లలు రైడర్కి చెందినవారా అని కొందరు ఆశ్చర్యపోతే.. ప్రతి విషయాన్ని తప్పుగా ఆలోచించకూడదు. ఆ పిల్లలు అందరు అతని సంతానం కాకపోవచ్చు. ప్రజా రవాణా వ్యవస్థ లేకపోవడంతో అలా చేయవలసిన పరిస్థితి ఏర్పడి ఉండవచ్చు అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇక ఆ మనుషుల కన్నా కూడా సైకిల్, టైర్ కంపెనీ మీద నాకు ఆసక్తి పెరుగుతోంది. చాలా ధృడంగా ఉన్నాయని మరో నెటిజన్ ఫన్నీ కామెంట్ పెట్టాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…