Viral News : సంక్రాంతి అంటేనే.. అత్తవారింటికి కొత్త అల్లుళ్లు వచ్చి హంగామా చేసే పండుగ. ఈ క్రమంలోనే కొత్త అల్లుడికి అత్తింటి వారు మర్యాదలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మర్యాదలు ఏమీ తక్కువ కాకుండా చూసుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఇది మామూలే. ఇక గోదావరి జిల్లాల్లో అయితే అల్లుళ్లకు సంక్రాంతి పండుగ సమయంలో లభించే మర్యాదలు అన్నీ ఇన్నీ కావు.
సంక్రాంతి సందర్భంగా పశ్చిమ గోదావరికి చెందిన ఓ కుటుంబం తమ కొత్త అల్లుడికి ఏకంగా 365 రకాల వంటకాలతో భోజనం పెట్టారు. ఆ భోజనంలో అనేక వెరైటీలు ఉన్నాయి. అన్నం, పులిహోర, బిర్యానీ.. వంటి వంటకాలను అత్తింటి వారు వండి అల్లుడికి వడ్డించారు.
30 రకాల కూరలు, 160 రకాల స్వీట్లు, 19 రకాల కారం పదార్థాలు, 15 రకాల ఐస్ క్రీమ్లు, 35 రకాల కూల్ డ్రింక్స్, 15 రకాల కేకులు ఆ భోజనంలో ఉన్నాయి. వాటన్నింటితో ఆ కుటుంబం తమ అల్లుడికి భోజనం పెట్టింది. దీంతో ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గతంలోనూ ఇలాగే కొందరు అత్తింటి వారు తమ అల్లుళ్లకు ఈ విధంగా అధిక సంఖ్యలో వంటకాలతో భోజనాలు పెట్టి వార్తల్లో నిలిచారు. దీంతో ఇప్పుడీ వార్త కూడా వైరల్ అవుతోంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…