Vijay Devarakonda : సినిమా ఎంత భారీ స్థాయిలో తెరకెక్కించినప్పటికీ విజయం సాధిస్తుందని కచ్చితంగా చెప్పలేరు. కానీ ఒక సినిమా విజయం కంటే పరాజయమే ఒక నటుడికి జీవితంలో గుణపాఠాలు నేర్పుతుందని చెబుతారు. ఒక చిత్ర పరాజయం దానిలో పని చేసిన వారందరిపై ప్రభావం చూపుతుంది. కాగా హీరో విజయ్ దేవరకొండ విషయంలో కూడా లైగర్ సినిమా ఫ్లాప్ అవడం ఇదే విధంగా మార్పు తీసుకొచ్చిందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. లైగర్ తో పాన్ ఇండియా స్టార్ అవుదామనుకున్న విజయ్ కి ఒక విధంగా ఈ సినిమా పరాజయం మేలు చేసిందనే అంటున్నారు.
లైగర్ ఘోరంగా విఫలం అవడంతో పూరీ జగన్నాథ్ తో తన తదుపరి సినిమా అయిన జన గణ మన గురించి మాట్లాడటానికి విజయ్ దేవర కొండ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. చాలా ఏళ్లుగా జన గణ మన చిత్రం పూరీ కలల ప్రాజెక్ట్ గా ఉన్న విషయం ఇది వరకే తెలుసు. ఎంతో మంది హీరోలతో అనుకున్నప్పటికీ చాలా కాలం ఎదురుచూసిన తరువాత చివరకు విజయ్ దేవరకొండతో చేయడానికి సిద్ధమయ్యారు. షూటింగ్ ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. పూజా హెగ్డేను హీరోయిన్ గా అనుకోవడం జరిగింది.
అయితే ప్రస్తుతం సైమా అవార్డ్స్ వేడుకల్లో పాలుపంచుకుంటున్న విజయ్ ని ఈ సినిమా గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించడం జరిగింది. దానికి ఆయన స్పందిస్తూ.. ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేసి ఆనందంగా ఇంటికి వెళ్లమని వారికి సూచించడం జరిగింది. దీంతో ఇక ఇప్పట్లో జన గణ మన సినిమా లేనట్లేనని భావిస్తున్నారు. ఈ చిత్ర యూనిట్ కూడా ఎవరూ ఈ విషయంపై స్పదించకపోవడంతో ఆ సినిమా ఆగిపోయిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…