Vijay Devarakonda : భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ వస్తుందటే చాలు.. క్రికెట్ ప్రేమికులకు పండగే అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం ఈ రెండు జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. ఆసియా కప్ 2022 టోర్నీలో భాగంగా నిర్వహించిన ఈ మ్యాచ్లో భారత్.. పాకిస్థాన్పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్ ఏమోగానీ అందరూ విజయ్ దేవరకొండను ట్రోల్ చేస్తున్నారు. అసలే లైగర్ మూవీ ఫ్లాప్ అయిన విచారంలో విజయ్ ఉండగా.. ఆయనను నెటిజన్లు ఇంకా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. తాజాగా భారత్, పాక్ మ్యాచ్ నేపథ్యంలో విజయ్ని మళ్లీ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.
భారత్, పాకిస్థాన్ మ్యాచ్ను చూసేందుకు విజయ్ దుబాయ్ వెళ్లాడు. ఆ మ్యాచ్ను చూశాడు. మ్యాచ్ను చూస్తుండగా.. విజయ్ని కెమెరాల్లో చూపించారు. అంతేకాదు.. మైక్లో మాట్లాడాడు కూడా. అయితే విజయ్ మ్యాచ్ను వీక్షించడం ఏమోగానీ.. ఆయన వల్లే పాకిస్థాన్ ఓడిందని అంటున్నారు. ఆయనది ఐరన్ లెగ్ అని.. ఆయన లైగర్ మూవీ ఫెయిల్ అయి ఇక్కడకు వచ్చాడని.. దీంతో పాకిస్థాన్ను ఫెయిల్ చేశాడని అంటున్నారు. ఈ క్రమంలోనే విజయ్ ఎక్కడికి వెళ్లినా ఆయనకు ప్రస్తుతం ట్రోల్స్ బాధ తప్పడం లేదు.
అయితే విజయ్ని ఇలా ట్రోల్ చేయడం వెనుక కూడా బలమైన కారణమే ఉంది. లైగర్ మూవీ రిలీజ్కు ముందు విజయ్తోపాటు చిత్ర యూనిట్ సభ్యులు తమ సినిమాపై తమకు ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో అనేక కామెంట్స్ చేశారు. ఓటీటీ వాళ్లు రూ.200 కోట్లు ఇస్తామన్నా వద్దనుకున్నామని.. ఎందుకంటే తమ సినిమా ఇంకా అంతకన్నా ఎక్కువ వసూలు చేస్తుందని అన్నారు. కానీ తీరా చూస్తే సీన్ రివర్స్ అయింది. ఇలా మూవీ రిలీజ్కు ముందు అనేక సార్లు ఓవర్ కాన్ఫిడెన్స్గా విజయ్, చార్మి, పూరీ చేసిన వ్యాఖ్యలే కొంపముంచాయి. దీంతో ఇప్పుడు వారిని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ ట్రోల్స్ ఎప్పుడు తగ్గుతాయో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…