Vidyullekha Raman : కోలీవుడ్ కమెడియన్, నటి విద్యుల్లేఖా రామన్ ఇటీవల పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట పెళ్ళి తర్వాత హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ట్రిప్ కి సంబంధించిన ఎన్నో ఫోటోల్ని విద్యుల్లేఖా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూనే ఉంది. లేటెస్ట్ గా స్విమ్మింగ్ పూల్ లో బ్రేక్ ఫాస్ట్ అంటూ ఓ ఫోటోను అప్ లోడ్ చేసింది.
ఆ ఫోటో కూడా తెగ ట్రెండ్ అయ్యింది. ఈ క్రమంలో విద్యుల్లేఖా రామన్ స్విమ్ సూట్ లో ఓ ఫోటోను పోస్ట్ చేసింది. అలాగే ఏడాదిలో రెండు సార్లు, ఆరు నెలల పాటు నాకు సెలవులు కావాలంటూ ఓ మెసేజ్ కూడా ట్యాగ్ చేసింది. ఈ ఫోటోని చూసిన నెటిజన్లు విడాకులు ఎప్పుడు ? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో విద్యుల్లేఖా స్పందించారు.
అంటే.. ఓ మహిళ తన భర్తతో కలిసి ఎన్ని రోజులు ఉంటుందనేది ఆమె వేసుకునే దుస్తులు డిసైడ్ చేస్తాయా ? అంటూ ప్రశ్నించారు. స్విమ్ సూట్ ధరిస్తే విడాకులు ఎప్పుడు ? అనే ప్రశ్నలు వేస్తున్నారా.. అద్భుతం అంకుల్స్ అండ్ ఆంటీస్.. 1920 నుండి బయటకు వచ్చి 2021 లోకి రండి. దుస్తులు ధరించిన వాళ్ళంతా సంతోషకరమైన వైవాహిక జీవితాల్లో ఉన్నారా ? అని ప్రశ్నించారు.
సంజయ్ లాంటి భర్త తనకు దొరకడం చాలా అదృష్టం అని, అలాంటి కామెంట్స్ ని పట్టించుకోవద్దని చెప్పారని.. కానీ తానంత ఈజీగా తీసుకోలేనని అన్నారు. అయితే వాళ్ళ జీవితంలో మహిళలు తమ వ్యక్తిత్వం కాపాడుకోవడానికి బలంగా నిలబడాలని ఆశిస్తున్నానని.. మీరు జీవించండి జీవించనివ్వండి.. అంటూ పేర్కొన్నారు.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం మార్చి 8, 2026న జరగనున్న భారత్, న్యూజిలాండ్ టీ20 ప్రపంచ కప్ ఫైనల్…
నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ భార్య సంగీత చెంగల్ పట్టు జిల్లా కోర్టులో మరో కొత్త పిటిషన్ దాఖలు…
నటుడు అక్కినేని నాగచైతన్య తన భార్య శోభిత ధూళిపాళతో కలిసి ఒడిశాలోని పూరీలో ఉన్న సుప్రసిద్ధ పూరీ జగన్నాథున్ని దర్శించుకున్నారు.…
టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ లో భారత్ జట్టు న్యూజిలాండ్ తో మార్చి 8, 2026న తలపడనుంది. ఈ…
భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ 2 తర్వాత…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 13 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించనున్నట్లు ప్రకటించారు.…
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్ డిజిటల్ వీక్షణలో ప్రపంచ రికార్డు…
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం పాటించే ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా…