Venkatesh : విక్టరీ వెంకటేష్.. ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన అగ్ర హీరోల్లో ఒకరు. ప్రస్తుతం భిన్న రకాల సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. మల్టీ స్టారర్ మూవీలకు వెంకటేష్ ప్రస్తుతం పెద్ద పీట వేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ఈయన నటించిన ఎఫ్3 మూవీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ను కూడా వేగవంతం చేశారు. ఇక ఈయన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను వెల్లడించారు.
తెలుగు బుల్లితెరపై ఇప్పటికే అనేక మంది స్టార్ హీరోలు యాంకర్లుగా వ్యవహరించి మెప్పించారు. బిగ్బాస్ ద్వారా ఎన్టీఆర్, నాగార్జున, నాని ఆకట్టుకోగా.. ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడుతోనూ మెప్పించారు. చిరంజీవి కూడా ఇదే షోకు హోస్ట్గా వ్యవహరించారు. అలాగే రానా దగ్గుబాటి నంబర్ వన్ యారి చేశారు. బాలకృష్ణ అన్స్టాపబుల్ షోతో ఎంట్రీ ఇచ్చారు. ఇలా స్టార్ హీరోలు ఇప్పటికే బుల్లితెరపై సందడి చేయగా.. వెంకటేష్ మాత్రం రియాలిటీ షోలను చేయడం లేదు. అయితే దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి ? అని ఆయనను అడగ్గా.. అందుకు ఆయన ఆశ్చర్యకరంగా సమాధానం ఇచ్చారు.
రియాలిటీ షోలు అంటే.. కొన్ని సార్లు చెప్పిన డైలాగ్లనే మళ్లీ చెప్పాలి. అదే యాక్ట్ను మళ్లీ రిపీట్ చేయాలి. అలా ఒకటి రెండు సార్లు అయితే చేయగలం. కానీ పదే పదే అలా చేయడం నా వల్ల కాదు.. నేను అలా చేస్తుంటే ఒకదశలో బ్లాంక్ అయిపోతాను.. ఇంక నాతో కాదు.. అందుకనే రియాలిటీ షోలను చేయడం లేదు.. అని వెంకటేష్ సమాధానం ఇచ్చారు.
ఇక వెంకటేష్ను తన కుమారుడు ఎప్పుడు సినిమాల్లోకి వస్తాడని ప్రశ్నించగా.. ఇప్పటి వరకు అయితే తమకు ఆ ఉద్దేశం లేదని.. వారు ఏం అవదలచుకున్నారో వారి ఇష్టమని అన్నారు. ప్రస్తుతానికి విద్యాభ్యాసం కొనసాగుతుందని.. అది పూర్తయ్యాక తన కెరీర్పై తానే నిర్ణయం తీసుకుంటాడని.. వెంకటేష్ అన్నారు. కాగా వెంకటేష్ నటించిన ఎఫ్3 మూవీ ఈ నెల 27 న రిలీజ్ కానుండగా.. ఇందులో ఆయనకు జోడీగా తమన్నా యాక్ట్ చేసింది. వరుణ్ తేజ్, మెహ్రీన్, సునీల్, రాజేంద్ర ప్రసాద్లు కూడా ఇందులో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. దిల్ రాజు నిర్మించారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…