Vanitha Vijay Kumar : సీనియర్ నటులు మంజుల, విజయ్ కుమార్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరి పెద్ద కుమార్తె వనిత విజయ్ కుమార్ తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈమె ఇప్పటి వరకు మూడు వివాహాలు చేసుకుంది. కానీ ఒక్కటి కూడా నిలబడలేదు. మూడు సార్లు విడాకులు తీసుకుంది. అయితే తన జీవితం గురించి వనిత విజయ్ కుమార్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వనిత విజయ్ కుమార్ మాట్లాడుతూ.. తమ తల్లి మంజుల రాత్రి, పగలు తేడా లేకుండా షూటింగ్స్కు వెళ్లి కష్టపడుతూ తమ కోసం డబ్బు సంపాదిస్తుంటుందని తెలిపింది. అయితే తమకు ఆస్తులు సమానంగా రావల్సి ఉన్నా.. తన తండ్రి విజయ్ కుమార్ మాత్రం ఇవ్వనని అంటున్నాడని తెలిపింది. తనమీద ఆయన కేసులు పెట్టాడని తెలియజేసింది. ఈ క్రమంలోనే తన ఆస్తుల విషయమై సుప్రీం కోర్టు దాకా వెళ్లానని చెప్పింది.
కేవలం తన తండ్రికి మాత్రమే కాదు, ఇంట్లో అందరికీ తానంటే ఇష్టం ఉండదని వనిత తెలియజేసింది. ఇతరులు ఎవరైనా తన గురించి తన కుటుంబ సభ్యులను అడిగితే వారు నన్ను తమ ఫ్యామిలీ కాదని చెబుతారని.. ఇది తనను అత్యంత బాధకు గురి చేస్తుందని చెప్పింది. తాను అంటే తన ఇంట్లో వాళ్లకే ఎందుకు ఇష్టం ఉండదో ఇప్పటికీ అర్థం కావడం లేదని చెప్పుకొచ్చింది.
తనను అడ్రస్ లేకుండా చేస్తానని తన తండ్రి అన్నాడని వనిత చెప్పింది. తన తల్లి ఇంట్లో నుంచి తనను గెంటేశారని, కట్టుబట్టలతో ఇంటి నుంచి పిల్లలను బయటకు తీసుకుని వచ్చానని.. ఎన్నో ఇబ్బందులు పడ్డానని.. ప్రస్తుతం తనను తమిళ ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పింది.
తనకు చిన్న తనంలోనే పెళ్లి అయిందని, అది తన జీవితంపై ప్రభావం చూపించిందని.. అందుకనే తాను చేసుకున్న వివాహాలు ఎక్కువ కాలం నిలబడడం లేదని ఆమె తెలియజేసింది. ఆమెకు ఇప్పటి వరకు మూడు పెళ్లిళ్లు జరిగాయి కానీ వివాహ బంధం నిలబడలేదు. అయితే ఎదుటి వారి కోసం తన తీరును మార్చుకోలేనని ఆమె ఖరాఖండిగా చెప్పేసింది. తనను చూసి కొందరు తనకు పొగరని అంటుంటారని, అయినా ఆ మాటలను లెక్క చేయనని స్పష్టం చేసింది.
కాగా వనిత విజయ్ కుమార్ పలు చిత్రాల్లో నటించి అలరించింది. ఈమె కోడిరామకృష్ణ చిత్రం దేవి లో సుశీల పాత్ర పోషించింది. ప్రస్తుతం తమిళంలో ఈమె పలు చిత్రాలు చేస్తోంది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…