Rashmi Gautam : బుల్లితెరపై యాంకర్గా విజయవంతంగా రాణిస్తున్న రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకుంది. ఒకటి రెండు సినిమాల్లో నటించింది. కానీ అనసూయకు వచ్చినంత పేరు ఈమెకు రాలేదు. అనసూయ మాత్రం సినిమాల్లోనూ దూసుకుపోతోంది. అయితే యాంకర్గా మాత్రం రష్మి గౌతమ్ ఆకట్టుకుంటోంది.
ఇక రష్మి గౌతమ్ సోషల్ మీడియాలోనూ ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన విషయాలను అందులో ఆమె షేర్ చేస్తుంది. గ్లామర్ ఫొటోలను పోస్ట్ చేస్తుంటుంది. రష్మి గౌతమ్ ఎంత గ్లామరస్గా ఉంటుందో.. అంతే విధంగా జంతువులను కూడా ఒక రేంజ్లో ప్రేమిస్తుంది. ముఖ్యంగా కుక్కలు అంటే ఆమెకు ప్రాణం.
మూగ జీవాలను హింసించారనే వార్తలపై ఆమె ఎల్లప్పుడూ స్పందిస్తుంటుంది. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరుతుంటుంది. ఇక తాజాగా ఇలాంటిదే ఓ సంఘటనపై ఆమె స్పందించింది.
బెంగళూరులో ఓ యువకుడు తన అపార్ట్మెంట్ వద్ద కారు నడుపుతూ అక్కడే పడుకుని ఉన్న ఓ కుక్కను తొక్కించాడు. దీంతో ఆ కుక్క చనిపోయింది. అయితే ఆ యువకుడిది బడా ఫ్యామిలీ అయినప్పటికీ పోలీసులు అవేమీ లెక్క చేయకుండా అతన్ని అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే రష్మి స్పందిస్తూ.. ఆ పోలీసులను అభినందించింది. కొందరు డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చని అనుకుంటారని.. కానీ బుద్ధిని కొనలేమని.. ఇలాంటి వాళ్లని కఠినంగా శిక్షించాలని ఆమె కోరింది. అలాగే మూగ జీవాలను అలా హింసించే వాళ్లు వారు కూడా అదే బాధను అనుభవిస్తారని ఆమె పేర్కొంది. కుక్కలను రాళ్లతో కొట్టడం చిన్నతనంలో నేర్పిస్తే వారు పెద్దయ్యాకే ఇలాగే చేస్తారని అభిప్రాయపడింది. కాగా రష్మి వ్యాఖ్యలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…