Tollywood : సాధారణంగా దర్శక నిర్మాతలకు సినిమాను తెరకెక్కించడం ఒకెత్తయితే.. దానికి పబ్లిసిటీ ఇవ్వడం ఒకెత్తు. సినిమా ప్రీ రిలీజ్ వేడుకలను ఎంత గ్రాండ్గా నిర్వహిస్తే మూవీ ప్రేక్షకుల్లోకి అంత బాగా వెళ్తుందని నమ్ముతున్నారు. అందుకనే ప్రీ రిలీజ్ వేడుకలను చాలా గ్రాండ్గా నిర్వహిస్తున్నారు.
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు, ప్రీ రిలీజ్ వేడుకలకు దుబాయ్ వైపు చూస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్న సినిమాలకు చెందిన దర్శక నిర్మాతలు, హీరోలు దుబాయ్లో తమ సినిమా ఫంక్షన్లను నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో రజనీకాంత్ నటించిన 2.0 చిత్ర వేడుకలను అక్కడే నిర్వహించారు.
ఇక రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీకి కూడా దుబాయ్లోనే వేడుకలను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. దీంతో మూవీకి కావల్సినంత పబ్లిసిటీ లభిస్తుందని భావిస్తున్నారు. అలాగే పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న పుష్ప మూవీని కూడా దుబాయ్లోనే ప్రమోట్ చేయాలని, అక్కడే ఈ మూవీకి ఫంక్షన్స్ నిర్వహించాలని బన్నీ భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీ మొత్తం తమ చిత్ర వేడుకలకు దుబాయ్ వైపు చూస్తోంది. మరి ఆయా మూవీలు బాక్సాఫీస్ వద్ద ఏ మేర ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…