Tollywood : సాధారణంగా ఒకప్పుడు తెలుగు సినిమాలు అంటే.. ఆరు పాటలు, రెండు ఫైట్లు, ఒక కామెడీ ట్రాక్.. ఇలా సాగేవి. కానీ రాజమౌళి రాకతో తెలుగు సినిమాలకు అర్థమే మారిపోయిందని చెప్పవచ్చు. ఆయన సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచాయి. దీంతో ఆయన ఎంతో ఖ్యాతిని గడించడమే కాక.. పాన్ ఇండియా స్థాయి సినిమాలు తీస్తూ అలరిస్తున్నారు. బాహుబలి 2 మూవీకి రూ.1900 కోట్లు వచ్చాయంటే రాజమౌళి ప్రతిభ ఎంతటిదో ఇట్టే అర్థమవుతుంది.
రూ.1000 కోట్లను ఒక సినిమా కలెక్ట్ చేస్తుందని ఎవరూ అనుకోలేదు. కానీ దాన్ని రాజమౌళి చేసి చూపించారు. ఇక ఆయన సినిమాలకు బడ్జెట్ కూడా అధికంగానే అవుతుంటుంది. ఈ క్రమంలోనే రాజమౌళి సినిమా అంటే హిట్ పక్కా కనుక నిర్మాతలు ఎంత మొత్తమైనా చెల్లించేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. ఇక రాజమౌళి మాత్రమే కాకుండా ఇతర దర్శకులు కూడా తెలుగులో భారీ బడ్జెట్తో సినిమాలను తీస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్లో ఇప్పటి వరకు అత్యధిక బడ్జెట్ అయిన చిత్రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాను మహేష్ బాబుతో రూపొందించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అయినా ఈ సినిమాకు గాను రూ.800 కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనా వేశారు. అలాగే ప్రభాస్ తీస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాకు రూ.600 కోట్ల వరకు బడ్జెట్ అవుతోంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ మూవీ బడ్జెట్ రూ.550 కోట్లు అయింది. పుష్ప సినిమా అత్యధిక స్థాయిలో ప్రేక్షకుల మనసును దోచుకుని హిట్ అయింది. పుష్ప 2 సినిమాకి గాను దాదాపుగా రూ.400 కోట్ల బడ్జెట్ అని అనుకుంటున్నారు.
ప్రభాస్ నటించిన సాహో సినిమాకు కలెక్షన్స్ బాగానే వచ్చినప్పటికీ బడ్జెట్ ఎక్కువ అవ్వడం వల్ల రికవరీ చేయలేకపోయింది. ఈ సినిమాకు రూ.350 కోట్ల బడ్జెట్ అయింది. అలాగే రాధేశ్యామ్ కు రూ.300 కోట్లు, సైరా నరసింహా రెడ్డికి రూ.300 కోట్లు, బాహుబలి 2 కి రూ.250 కోట్లు బడ్జెట్ అవగా.. సలార్ కు రూ.200 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక పుష్ప మొదటి పార్ట్కు రూ.200 కోట్ల వరకు అయినట్లు తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…