Tollywood : సాధారణంగా ఒకప్పుడు తెలుగు సినిమాలు అంటే.. ఆరు పాటలు, రెండు ఫైట్లు, ఒక కామెడీ ట్రాక్.. ఇలా సాగేవి. కానీ రాజమౌళి రాకతో తెలుగు సినిమాలకు అర్థమే మారిపోయిందని చెప్పవచ్చు. ఆయన సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచాయి. దీంతో ఆయన ఎంతో ఖ్యాతిని గడించడమే కాక.. పాన్ ఇండియా స్థాయి సినిమాలు తీస్తూ అలరిస్తున్నారు. బాహుబలి 2 మూవీకి రూ.1900 కోట్లు వచ్చాయంటే రాజమౌళి ప్రతిభ ఎంతటిదో ఇట్టే అర్థమవుతుంది.
రూ.1000 కోట్లను ఒక సినిమా కలెక్ట్ చేస్తుందని ఎవరూ అనుకోలేదు. కానీ దాన్ని రాజమౌళి చేసి చూపించారు. ఇక ఆయన సినిమాలకు బడ్జెట్ కూడా అధికంగానే అవుతుంటుంది. ఈ క్రమంలోనే రాజమౌళి సినిమా అంటే హిట్ పక్కా కనుక నిర్మాతలు ఎంత మొత్తమైనా చెల్లించేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. ఇక రాజమౌళి మాత్రమే కాకుండా ఇతర దర్శకులు కూడా తెలుగులో భారీ బడ్జెట్తో సినిమాలను తీస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్లో ఇప్పటి వరకు అత్యధిక బడ్జెట్ అయిన చిత్రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాను మహేష్ బాబుతో రూపొందించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అయినా ఈ సినిమాకు గాను రూ.800 కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనా వేశారు. అలాగే ప్రభాస్ తీస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాకు రూ.600 కోట్ల వరకు బడ్జెట్ అవుతోంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ మూవీ బడ్జెట్ రూ.550 కోట్లు అయింది. పుష్ప సినిమా అత్యధిక స్థాయిలో ప్రేక్షకుల మనసును దోచుకుని హిట్ అయింది. పుష్ప 2 సినిమాకి గాను దాదాపుగా రూ.400 కోట్ల బడ్జెట్ అని అనుకుంటున్నారు.
ప్రభాస్ నటించిన సాహో సినిమాకు కలెక్షన్స్ బాగానే వచ్చినప్పటికీ బడ్జెట్ ఎక్కువ అవ్వడం వల్ల రికవరీ చేయలేకపోయింది. ఈ సినిమాకు రూ.350 కోట్ల బడ్జెట్ అయింది. అలాగే రాధేశ్యామ్ కు రూ.300 కోట్లు, సైరా నరసింహా రెడ్డికి రూ.300 కోట్లు, బాహుబలి 2 కి రూ.250 కోట్లు బడ్జెట్ అవగా.. సలార్ కు రూ.200 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక పుష్ప మొదటి పార్ట్కు రూ.200 కోట్ల వరకు అయినట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…