Puneeth Rajkumar : కన్నడ సినీ ఇండస్ట్రీ పవర్ స్టార్ గా గుర్తింపు పొందిన దివంగత పునీత్ రాజ్ కుమార్ 11వ రోజు కార్యక్రమానికి ఆయన సమాధిని దర్శించుకునేందుకు నటుడు సిద్ధార్థ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. పునీత్ రాజ్ కుమార్ కు తాను కూడా అభిమానిని అని.. అలాంటి వారు ఇంకేవ్వరూ ఉండరని సిద్ధార్థ్ ఎమోషనల్ అయ్యారు. పునీత్ మరణం యావత్ సినీ ఇండస్ట్రీకే లోటు అని.. ఆయన సేవా కార్యక్రమాలు ఎంతో ఉన్నతమైనవని.. అలాంటి వ్యక్తి స్థానాన్ని ఇంకెవ్వరూ రీప్లెస్ చేయలేరని సిద్ధార్థ్ తెలిపారు. ఆయన టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు.
అలాగే పునీత్ యంగ్ టాలెంట్ ని ఆదరించే గొప్ప వ్యక్తిగా ఉండేవారని, ఆయనకు సినీ ఇండస్ట్రీలో ఎంతో పేరు, ప్రఖ్యాతులు ఉన్నా ఎప్పుడూ సింపుల్ గా, సైలెంట్ గా ఉంటారని అన్నారు. సిద్ధార్థ్, పునీత్ ను కలిసిన ప్రతిసారి ఓ కొత్త విషయాన్ని నేర్చుకునేవాడినని అన్నారు. ఆయన ఎప్పుడూ ఇతరుల్ని మెచ్చుకుంటూ ప్రొత్సహించేవారని సిద్ధార్థ్ కన్నీళ్ళు పెట్టుకున్నారు. పునీత్ లాంటి వ్యక్తి మరొకరు ఉండరు. ఆయన మరణానికి చింతిస్తూ.. కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఆ తర్వాత పునీత్ భార్య అశ్విని మాట్లాడారు.
తన భర్త మరణంతో దిగ్భ్రాంతికి గురైన తమకు, తమ కుటుంబానికి ఎంతో సపోర్ట్ గా నిలిచిన అభిమానులకు.. ఆయన అంత్యక్రియలకు అవసరమైన కార్యక్రమాల్ని దగ్గరుండి చూసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమాల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా అంతా సజావుగా సాగేలా చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పారు. పునీత్ 11వ రోజు జరిగిన కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తన కుటుంబ సభ్యులు, కన్నడ సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, ఆహ్వానితులు హాజరయ్యారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…