Telugu States : పూర్వకాలం నుంచి సమాజంలో స్త్రీల పట్ల వివక్ష నెలకొని ఉంది. వారికేమీ చేతకాదు, వారు కేవలం వంట ఇంటికే పరిమితం కావాలనే భావం అప్పటి నుంచి ఉంది. దాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. స్త్రీలు పురుషుల కన్నా దీటుగా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నప్పటికీ వారిపై వివక్ష మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఓ షాకింగ్ సర్వే బయటకు వచ్చింది. అందులో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS) ప్రకారం మన దేశంలో చాలా రాష్ట్రాల్లో మహిళలు తమను తమ భర్తలు కొట్టినా ఫర్వాలేదని అనుకుంటున్నారు. 14 రాష్ట్రాల్లో 30 శాతం మంది మహిళలు ఇందుకు అనుకూలంగా ఉన్నారు. అంటే.. వీరందరూ తమను తమ భర్తలు కొట్టినా ఫర్వాలేదని భావిస్తున్నారన్నమాట.
అయితే ఈ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో మరీ అధ్వాన్నంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 84 శాతం మంది మహిళలు తమను తమ భర్తలు కొట్టినా ఫర్వాలేదులే అన్న ధోరణిలో ఉన్నట్లు వెల్లడైంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల తరువాత స్థానంలో కర్ణాటక ఉంది. అక్కడ 77 శాతం మంది మహిళలు ఆ విధంగా ఫీలవుతున్నారట.
సాధారణంగా ఇంట్లో పిల్లలను నిర్లక్ష్యం చేయడం, భర్త తరఫు కుటుంబ సభ్యులను పట్టించుకోకపోవడం, అనుమానాస్పదంగా వ్యవహరించడం లేదా వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, భర్త లేదా కుటుంబ సభ్యులతో తరచూ వాదించడం, శృంగారం చేసేందుకు విముఖతను చూపించడం, నమ్మకం లేకపోవడం, భర్తకు చెప్పకుండా బయటకు వెళ్లడం, ఇంటిని పట్టించుకోకపోవడం, వంట చేయకపోవడం.. వంటి అంశాల్లో భర్తలు తమను కొట్టినా ఫర్వాలేదులే.. అని ఆ శాతం మంది మహిళలు అనుకుంటున్నారు. ఈ మేరకు సర్వేలో వెల్లడి కావడం షాక్ను కలిగిస్తోంది.
అయితే ఈ విధంగా మహిళల ధోరణి ఉందంటే గృహ హింస కూడా ఎక్కువగానే ఉన్నట్లు భావించాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. పూర్వ కాలం నుంచి స్త్రీల పట్ల ఉన్న ధోరణి ఇంకా అలాగే ఉందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని నిపుణులు అంటున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…