Telugu States : పూర్వకాలం నుంచి సమాజంలో స్త్రీల పట్ల వివక్ష నెలకొని ఉంది. వారికేమీ చేతకాదు, వారు కేవలం వంట ఇంటికే పరిమితం కావాలనే భావం అప్పటి నుంచి ఉంది. దాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. స్త్రీలు పురుషుల కన్నా దీటుగా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నప్పటికీ వారిపై వివక్ష మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఓ షాకింగ్ సర్వే బయటకు వచ్చింది. అందులో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS) ప్రకారం మన దేశంలో చాలా రాష్ట్రాల్లో మహిళలు తమను తమ భర్తలు కొట్టినా ఫర్వాలేదని అనుకుంటున్నారు. 14 రాష్ట్రాల్లో 30 శాతం మంది మహిళలు ఇందుకు అనుకూలంగా ఉన్నారు. అంటే.. వీరందరూ తమను తమ భర్తలు కొట్టినా ఫర్వాలేదని భావిస్తున్నారన్నమాట.
అయితే ఈ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో మరీ అధ్వాన్నంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 84 శాతం మంది మహిళలు తమను తమ భర్తలు కొట్టినా ఫర్వాలేదులే అన్న ధోరణిలో ఉన్నట్లు వెల్లడైంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల తరువాత స్థానంలో కర్ణాటక ఉంది. అక్కడ 77 శాతం మంది మహిళలు ఆ విధంగా ఫీలవుతున్నారట.
సాధారణంగా ఇంట్లో పిల్లలను నిర్లక్ష్యం చేయడం, భర్త తరఫు కుటుంబ సభ్యులను పట్టించుకోకపోవడం, అనుమానాస్పదంగా వ్యవహరించడం లేదా వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, భర్త లేదా కుటుంబ సభ్యులతో తరచూ వాదించడం, శృంగారం చేసేందుకు విముఖతను చూపించడం, నమ్మకం లేకపోవడం, భర్తకు చెప్పకుండా బయటకు వెళ్లడం, ఇంటిని పట్టించుకోకపోవడం, వంట చేయకపోవడం.. వంటి అంశాల్లో భర్తలు తమను కొట్టినా ఫర్వాలేదులే.. అని ఆ శాతం మంది మహిళలు అనుకుంటున్నారు. ఈ మేరకు సర్వేలో వెల్లడి కావడం షాక్ను కలిగిస్తోంది.
అయితే ఈ విధంగా మహిళల ధోరణి ఉందంటే గృహ హింస కూడా ఎక్కువగానే ఉన్నట్లు భావించాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. పూర్వ కాలం నుంచి స్త్రీల పట్ల ఉన్న ధోరణి ఇంకా అలాగే ఉందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని నిపుణులు అంటున్నారు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…