Sivaji : నటుడు శివాజీ వెండితెరపై కనిపించి చాలా రోజులే అయింది. ఆయన చివరి సారిగా 2016లో సీసా అనే సినిమాలో కనిపించారు. తరువాత సినిమాలకు దూరమయ్యారు. కొంత కాలం పాటు పాలిటిక్స్లో చురుగ్గా ఉన్నారు. అప్పట్లో ఆయన ప్రత్యేక హోదా గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. కొంత కాలం పాటు చంద్ర బాబును విమర్శించారు. ఆ తరువాత యూ టర్న్ తీసుకుని టీడీపీలో చేరారు. చంద్రబాబు మళ్లీ వస్తేనే ఏపీ బాగు పడుతుందని అప్పుడప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఆయన అటు సినిమాల్లో.. ఇటు రాజకీయాల్లో యాక్టివ్గా కనిపించి చాలా రోజులే అయింది. కాగా ఆయన ఓ కార్యక్రమంలో భాగంగా చేసిన వ్యాఖ్యలకు ఆయనను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
శ్రీవిష్ణు హీరోగా అల్లూరి టైటిల్తో ఓ మూవీని తెరకెక్కిస్తున్న విషయం విదితమే. అందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన ఓ ప్రమోషనల్ కార్యక్రమంలో నటుడు శివాజీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా చివరి సినిమా బూచమ్మ బూచోడు. సినిమాలు వదిలేయకుండా ఉండి ఉంటే ఈ 10 ఏళ్లలో కనీసం రూ.10 నుంచి రూ.15 కోట్లు సంపాదించేవాడిని. కానీ పాలెం బస్సు సంఘటన నన్ను కలచి వేసింది. నన్ను సినిమాలకు దూరం చేసింది.. అని అన్నారు.
అయితే శివాజీ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. మీరు ఏమైనా మెగాస్టారా.. అన్ని కోట్లు సంపాదించడానికి. మీరు ఏమంత పెద్ద స్టార్.. అన్ని కోట్లు సంపాదించేందుకు.. అని ప్రశ్నిస్తూ ఆయనను ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ప్రస్తుతం శివాజీ అమెరికాలో ఉంటూ అప్పుడప్పుడు ఇండియాకు వచ్చి ఇలా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…