Sivaji : నటుడు శివాజీ వెండితెరపై కనిపించి చాలా రోజులే అయింది. ఆయన చివరి సారిగా 2016లో సీసా అనే సినిమాలో కనిపించారు. తరువాత సినిమాలకు దూరమయ్యారు. కొంత కాలం పాటు పాలిటిక్స్లో చురుగ్గా ఉన్నారు. అప్పట్లో ఆయన ప్రత్యేక హోదా గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. కొంత కాలం పాటు చంద్ర బాబును విమర్శించారు. ఆ తరువాత యూ టర్న్ తీసుకుని టీడీపీలో చేరారు. చంద్రబాబు మళ్లీ వస్తేనే ఏపీ బాగు పడుతుందని అప్పుడప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఆయన అటు సినిమాల్లో.. ఇటు రాజకీయాల్లో యాక్టివ్గా కనిపించి చాలా రోజులే అయింది. కాగా ఆయన ఓ కార్యక్రమంలో భాగంగా చేసిన వ్యాఖ్యలకు ఆయనను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
శ్రీవిష్ణు హీరోగా అల్లూరి టైటిల్తో ఓ మూవీని తెరకెక్కిస్తున్న విషయం విదితమే. అందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన ఓ ప్రమోషనల్ కార్యక్రమంలో నటుడు శివాజీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా చివరి సినిమా బూచమ్మ బూచోడు. సినిమాలు వదిలేయకుండా ఉండి ఉంటే ఈ 10 ఏళ్లలో కనీసం రూ.10 నుంచి రూ.15 కోట్లు సంపాదించేవాడిని. కానీ పాలెం బస్సు సంఘటన నన్ను కలచి వేసింది. నన్ను సినిమాలకు దూరం చేసింది.. అని అన్నారు.
అయితే శివాజీ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. మీరు ఏమైనా మెగాస్టారా.. అన్ని కోట్లు సంపాదించడానికి. మీరు ఏమంత పెద్ద స్టార్.. అన్ని కోట్లు సంపాదించేందుకు.. అని ప్రశ్నిస్తూ ఆయనను ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ప్రస్తుతం శివాజీ అమెరికాలో ఉంటూ అప్పుడప్పుడు ఇండియాకు వచ్చి ఇలా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…