ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితులలో జర్నలిస్టుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక వాట్సాప్ నెంబర్ ని ఏర్పాటు చేసింది. ఎంతో మంది జర్నలిస్టులు తమ విధి నిర్వహణలో కరోనా బారినపడి సరైన సమయంలో వైద్యం అందక మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలోనే శుక్రవారం ప్రెస్ క్లబ్ హైదరాబాద్ బృందం వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించింది.
ఈ సమావేశంలో భాగంగా జర్నలిస్టులకు కోవిడ్ వైద్యసేవలు సత్వరం అందించే దిశగా వైద్య ఆరోగ్యశాఖ హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడాన్ని ప్రెస్క్లబ్ హైదరాబాద్ స్వాగతించింది. ఈ మేరకు శనివారం నుంచి జర్నలిస్టుల వైద్య సేవల కోసం ప్రత్యేక వాట్సాప్ నెంబర్ ను అందుబాటులో ఉంచుతామని తెలిపింది.
ఎవరికైతే కరోనా లక్షణాలు ఉన్నాయో వారు ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా వివరాలను అందిస్తే వారికి వెంటనే వైద్య పరీక్షలు, మందులు సరఫరా, బెడ్లు మొదలైన సదుపాయాలు ఏర్పాటు చేస్తామని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఉన్నతాధికారులు తెలియజేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాలలో కూడా ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలను త్వరలోనే ఏర్పాటు చేస్తామని వైద్య అధికారులు తెలిపారు.
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…