ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితులలో జర్నలిస్టుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక వాట్సాప్ నెంబర్ ని ఏర్పాటు చేసింది. ఎంతో మంది జర్నలిస్టులు తమ విధి నిర్వహణలో కరోనా బారినపడి సరైన సమయంలో వైద్యం అందక మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలోనే శుక్రవారం ప్రెస్ క్లబ్ హైదరాబాద్ బృందం వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించింది.
ఈ సమావేశంలో భాగంగా జర్నలిస్టులకు కోవిడ్ వైద్యసేవలు సత్వరం అందించే దిశగా వైద్య ఆరోగ్యశాఖ హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడాన్ని ప్రెస్క్లబ్ హైదరాబాద్ స్వాగతించింది. ఈ మేరకు శనివారం నుంచి జర్నలిస్టుల వైద్య సేవల కోసం ప్రత్యేక వాట్సాప్ నెంబర్ ను అందుబాటులో ఉంచుతామని తెలిపింది.
ఎవరికైతే కరోనా లక్షణాలు ఉన్నాయో వారు ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా వివరాలను అందిస్తే వారికి వెంటనే వైద్య పరీక్షలు, మందులు సరఫరా, బెడ్లు మొదలైన సదుపాయాలు ఏర్పాటు చేస్తామని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఉన్నతాధికారులు తెలియజేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాలలో కూడా ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలను త్వరలోనే ఏర్పాటు చేస్తామని వైద్య అధికారులు తెలిపారు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…