దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజూ 2.50 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో పరిస్థితి చేయి దాటిపోతోంది. ఇక తెలంగాణలోనూ రోజువారీగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలోనే హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది.
మంగళవారం (ఏప్రిల్ 20) నుంచి మే 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు తెలంగాణ రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూ అమలు కానుంది. రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో రోజూ రాత్రి 9 నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. కర్ఫ్యూ వల్ల రాత్రి 8 గంటలకే వ్యాపార, వాణిజ్య సముదాయాలు, సంస్థలను మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇక ఉద్యోగులు రాత్రి 9 గంటల వరకు ఇళ్లకు చేరుకోవాల్సి ఉంటుంది. అత్యవసర సేవలకు మినహాయింపులు ఇస్తారు. మీడియా, టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ సేవలు, కేబుల్ సేవలు, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, ఈ-కామర్స్ సంస్థల సేవలు, పెట్రోల్ పంపులు, విద్యుత్, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, కోల్డ్ స్టోరేజీలు, వేర్ హౌస్ల సేవలు, సెక్యూరిటీ సేవలు, పరిశ్రమలు, ఇతర సేవలకు మినహాయింపులు ఇచ్చారు. అందువల్ల ఈ రంగాలకు చెందిన వారు ఎలాంటి ఆటంకం లేకుండా తమ పనులు కొనసాగించవచ్చు. అయితే ఆయా పరిశ్రమలు, సంస్థల్లో పనిచేసేవారు రాత్రి పూట విధులకు హాజరైతే తమ ఐడీ కార్డులను కచ్చితంగా చూపించాల్సి ఉంటుంది.
వైద్య సేవలు, ఎయిర్ పోర్టులు, బస్టాండ్ల నుంచి వచ్చేవారు తగిన ఆధారాలు చూపించి కర్ఫ్యూ నుంచి మినహాయింపు పొందవచ్చు. ఈ నిబంధనలను అతిక్రమించే వారిపై పోలీసులు చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటారు.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…