ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు అధికంగా ఉన్న నేపథ్యంలో పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ విధించారు. ఈ మేరకు కు కు తెలంగాణలో కేసుల సంఖ్య అధికంగా ఉన్న నేపథ్యంలో తెలంగాణలో కూడా లాక్ డౌన్ అమలు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటూ లాక్ డౌన్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం మధ్యాహ్నం ఫిలింనగర్లోని సీవీఆర్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన లాక్డౌన్ చెక్పోస్ట్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు విచిత్ర సంఘటన ఎదురైంది.
విధుల నిర్వహణలో భాగంగా ప్రతి ఒక్క వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తున్న పోలీసులకు ఒక వ్యక్తి తన కారులో కుక్కను తీసుకు వెళ్తు కనిపించాడు. ఈ క్రమంలోనే లాక్ డాన్ ఆంక్షలు అమలులో ఉండగా,బయటికి ఎందుకు వచ్చారని ఎస్ఐ నవీన్రెడ్డి ప్రశ్నించగా.. అందుకు సదరు వ్యక్తి ఒక విచిత్రమైన సమాధానం చెప్పారు.
తన కుక్కకు చాలా జ్వరంగా ఉందని, మందులు వేయకపోతే చచ్చిపోయేలా ఉంది. అందుకోసమే ఆస్పత్రికి తీసుకు వెళ్తున్నాను.. దయచేసి కుక్క పరిస్థితి చూసైనా మమ్మల్ని పంపించండి అంటూ యజమాని పోలీసులను వేడుకోగా పోలీసులు సైతం కుక్కను చూడగానే చలించిపోయారు. ఈ క్రమంలోనే పోలీసులు సరైన వైద్యం చేయించడం కోసం వారిని వెంటనే ఆస్పత్రికి పంపిన ఘటన సివిఆర్ జంక్షన్ చెక్ పోస్ట్ వద్ద చోటుచేసుకుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…