TECNO POVA 5G : మొబైల్స్ తయారీదారు టెక్నో.. పోవా 5జి (POVA 5G) పేరిట ఓ నూతన 5జి స్మార్ట్ ఫోన్ను భారత్లో విడుదల చేసింది. ఈ కంపెనీకి చెందిన తొలి 5జి ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో అనేక ఆకట్టుకునే అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. దీని ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం.
టెక్నో పోవా 5జి స్మార్ట్ ఫోన్లో 6.9 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన భారీ ఎల్సీడీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే క్వాలిటీగా ఉంటుంది. ఇక ఇందులో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ను ఏర్పాటు చేశారు. అందువల్ల ఇది 5జి కి సపోర్ట్ను అందిస్తుంది. ఈ ఫోన్లో 8జీబీ ర్యామ్ను అందిస్తున్నారు. అవసరం అయితే మరో 3జీబీ ర్యామ్ను వర్చువల్గా పెంచుకోవచ్చు. ఇక 128 జీబీ స్టోరేజ్ దీంట్లో ఉంది. మెమొరీని కార్డు ద్వారా మరో 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ను ఇందులో అందిస్తున్నారు. డ్యుయల్ సిమ్లను వేసుకోవచ్చు.
ఈ ఫోన్ లో 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను వెనుక భాగంలో అందిస్తున్నారు. దీనికి తోడు మరో 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరా కూడా ఉంది. అలాగే 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఇందులో లభిస్తోంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ను ఇచ్చారు. 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్ సి వంటి ఇతర ఫీచర్లను ఈ ఫోన్లో అందిస్తున్నారు.
ఈ ఫోన్లో 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ లభిస్తుంది. కనుక ఈ ఫోన్ 33 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ పూర్తవుతుంది.
టెక్నో పోవా 5జి స్మార్ట్ ఫోన్ ఏథర్ బ్లాక్ కలర్ ఆప్షన్లోనే విడుదలైంది. ఈ ఫోన్ ధర రూ.19,999 ఉండగా.. దీన్ని అమెజాన్లో విక్రయిస్తున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది. ఇక దీన్ని కొనుగోలు చేసిన మొదటి 1500 మందికి రూ.1,999 విలువైన ఉచిత పవర్ బ్యాంక్ను అందించనున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…