Blood Sugar Levels : షుగ‌ర్ ఉన్న‌వారు వీటిని తింటే ప్ర‌మాదం.. ఏయే ఆహారాల‌ను తినాలంటే..?

Blood Sugar Levels : ప్రస్తుతకాలంలో అత్యధికంగా పీడిస్తున్న వ్యాధి మధుమేహం. ఏడాది పొడ‌వునా ప్రతి సీజన్‌లోనూ మధుమేహ వ్యాధిగ్రస్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్ ఉన్నవారు ఆరోగ్య విషయంలోనూ, తీసుకునే ఆహారం విషయంలోనూ ఎంతో జాగ్రత్త వహించాలి. మీరు తీసుకునే ఆహారమే మీ శరీరంలోని ఇన్సులిన్ స్థాయిల‌ హెచ్చుతగ్గుల‌పై ప్రభావం చూపిస్తుంది. ఆహారంలో నిత్యం పోషకాల‌ను తీసుకోవడం వలన రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణంలో ఉంటాయి.

డయాబెటిస్ పేషెంట్స్ రోజువారీ ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, అధిక ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు, ప్రోటీన్స్, ఉండేలా తీసుకోవటం ఉత్తమం. అయితే డయాబెటిస్ ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలను దూరం పెట్టడం మంచిది. కొన్ని కొన్ని సార్లు మనం తీసుకునే ఆహారం కారణంగా మందులతో నయం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది.

Blood Sugar Levels

డయాబెటిస్ ఉన్న వారు చక్కెర అధికంగా ఉండే పండ్లను అసలు తీసుకోకూడదు. డయాబెటిస్ ఉన్నవారు బాగా ఎక్కువ మొత్తంలో పుచ్చకాయలు, అరటి పండ్లు, ఎండు ద్రాక్ష, ఐస్ క్రీం, స్వీట్స్ తీసుకోకూడదు. ఒకవేళ డయాబెటిస్ పేషెంట్స్ పండు తినాలంటే చాలా మితంగా వాటిని తీసుకొనాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక అరటి పండు తినాలి అనిపిస్తే దానిలో సగభాగం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.

మామిడి, ఖర్బూజా, ద్రాక్షా, సీతాఫలాలు, పైనాపిల్ వంటి వాటిలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. అందువలన ఈ పండ్లకు దూరంగా ఉండాలి. నూనెలో వేయించిన పదార్థాలు మరియు వండిన ఎర్ర మాంసం, చికెన్ తింటే డయాబెటిస్ పేషెంట్ల‌లో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బార్బెక్యూయింగ్, బ్రాయిలింగ్, గ్రిల్లింగ్, వేయించే పద్దతుల్లో వండిన మాంసం తింటే ఈ ప్రమాదం మరీ ఎక్కువగా ఉంటుంది. అందువలన ఈ ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిద‌ని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

డయాబెటిస్ పేషెంట్స్ ఎక్కువగా పీచు మరియు మంచి ప్రోటీన్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. కార్బొహైడ్రేట్స్ ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. నిత్యజీవితంలో షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే శరీరానికి మంచి పోషకాలు ఇవ్వడం ఎంతో అవసరం. రాగులు, సజ్జలు, అవిసెలు, ఊదలు, సామలు వంటి చిరుధాన్యాలను ఆహారంలో నిత్యం తీసుకోవాలి. చిరుధాన్యాలను అధికంగా తీసుకుంటే జీర్ణశక్తి మెరుగవుతుంది. వీటిలో ఉండే ఎన్నో పోషకాలు గుండెజబ్బులు, డయాబెటిస్‌, రొమ్ము క్యాన్సర్ ల‌ను దరిచేరనివ్వవు. స్త్రీలల్లో వచ్చే మెనోపాజ్ సమస్యల‌ను కూడా అదుపు చేస్తాయి. క‌నుక చిరు ధాన్యాల‌ను ఎక్కువ‌గా తింటే డ‌యాబెటిస్ త‌గ్గ‌డంతోపాటు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM