T20 World Cup 2021 : దుబాయ్లో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 42వ మ్యాచ్లో నమీబియాపై భారత్ విజయం సాధించింది. నమీబియా నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ సునాయాసంగానే ఛేదించింది. ఈ క్రమంలో ఆ జట్టుపై భారత్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 132 పరుగులు చేసింది. నమీబియా బ్యాట్స్మెన్లలో డేవిడ్ వెయిస్ 26 పరుగులు, స్టీఫెన్ బార్డ్ 21 పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు చెరో 3 వికెట్ల చొప్పున తీశారు. బుమ్రాకు 2 వికెట్లు దక్కాయి.
అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 15.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 1 వికెట్ను మాత్రమే కోల్పోయి 136 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు అర్ధ సెంచరీలతో రాణించారు. 36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో రాహుల్ 54 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా, 37 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో రోహిత్ 56 పరుగులు చేశాడు. సూర్య కుమార్ యాదవ్ 25 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. నమీబియా బౌలర్లలో జాన్ ఫ్రైలింక్ 1 వికెట్ తీశాడు.
కాగా ఇప్పటికే సెమీ ఫైనల్ బెర్త్లు ఖరారు అయిన నేపథ్యంలో భారత్ ఆడిన ఈ మ్యాచ్ ఎలాంటి ప్రభావం చూపదు. ఈ మ్యాచ్తో టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ప్రధాన రౌండ్ మ్యాచ్లు ముగిశాయి. సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్లు మిగిలి ఉన్నాయి.
వరల్డ్ కప్ అనంతరం టీ20లకు కెప్టెన్గా తప్పుకుంటానని కోహ్లి ఇది వరకే ప్రకటించిన విషయం విదితమే. దీంతో కోహ్లి భారత టీ20 జట్టుకు కెప్టెన్గా తప్పుకున్నాడు. కేవలం బ్యాట్స్మెన్గానే కొనసాగనున్నాడు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…