T20 World Cup 2021 : దుబాయ్లో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 42వ మ్యాచ్లో నమీబియాపై భారత్ విజయం సాధించింది. నమీబియా నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ సునాయాసంగానే ఛేదించింది. ఈ క్రమంలో ఆ జట్టుపై భారత్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 132 పరుగులు చేసింది. నమీబియా బ్యాట్స్మెన్లలో డేవిడ్ వెయిస్ 26 పరుగులు, స్టీఫెన్ బార్డ్ 21 పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు చెరో 3 వికెట్ల చొప్పున తీశారు. బుమ్రాకు 2 వికెట్లు దక్కాయి.
అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 15.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 1 వికెట్ను మాత్రమే కోల్పోయి 136 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు అర్ధ సెంచరీలతో రాణించారు. 36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో రాహుల్ 54 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా, 37 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో రోహిత్ 56 పరుగులు చేశాడు. సూర్య కుమార్ యాదవ్ 25 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. నమీబియా బౌలర్లలో జాన్ ఫ్రైలింక్ 1 వికెట్ తీశాడు.
కాగా ఇప్పటికే సెమీ ఫైనల్ బెర్త్లు ఖరారు అయిన నేపథ్యంలో భారత్ ఆడిన ఈ మ్యాచ్ ఎలాంటి ప్రభావం చూపదు. ఈ మ్యాచ్తో టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ప్రధాన రౌండ్ మ్యాచ్లు ముగిశాయి. సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్లు మిగిలి ఉన్నాయి.
వరల్డ్ కప్ అనంతరం టీ20లకు కెప్టెన్గా తప్పుకుంటానని కోహ్లి ఇది వరకే ప్రకటించిన విషయం విదితమే. దీంతో కోహ్లి భారత టీ20 జట్టుకు కెప్టెన్గా తప్పుకున్నాడు. కేవలం బ్యాట్స్మెన్గానే కొనసాగనున్నాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…