T20 World Cup 2021 : దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్ పై గెలిచిన ఆస్ట్రేలియా ఫైనల్స్కు దూసుకెళ్లింది. పాక్ నిర్దేశించి లక్ష్యాన్ని ఆసీస్ సులభంగానే ఛేదించింది. ఓవైపు వికెట్లను కోల్పోయినప్పటికీ మిడిలార్డర్ బ్యాట్స్మెన్ ఆసీస్ను రక్షించారు. ధాటిగా ఆడుతూ పరుగులు తీశారు. దీంతో చివర్లో బౌండరీలు తోడయ్యాయి. ఈ క్రమంలో పాకిస్థాన్పై ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లను కోల్పోయి 176 పరుగులు చేసింది. పాక్ బ్యాట్స్మెన్లలో మహమ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజమ్లు రాణించారు. 52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో రిజ్వాన్ 67 పరుగులు చేయగా, 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో జమాన్ 55 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అలాగే కెప్టెన్ బాబర్ ఆజమ్ 34 బంతుల్లో 5 ఫోర్లతో 39 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2 వికెట్లు తీశాడు. ప్యాట్ కమ్మిన్స్, ఆడమ్ జంపాలకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 19 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 5 వికెట్లను కోల్పోయి 177 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్మెన్లలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 49 పరుగులు చేయగా, మార్కస్ స్టాయినిస్ 31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. మరో బ్యాట్స్మన్ మ్యాథ్యూ వేడ్ 17 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 41 పరుగులు చేసి నాటౌట్గా నిలవడమే కాక.. ఆసీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఫైనల్స్కు చేరుకుంది.
ఇక ఇప్పటికే ఇంగ్లండ్ మీద గెలిచిన న్యూజిలాండ్ ఫైనల్కు చేరుకోగా.. ఆ జట్టుతో ఆసీస్ తలపడనుంది. కివీస్, ఆసీస్ జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఈనెల 14వ తేదీన దుబాయ్లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరుగుతుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…