Sudeepa : సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది నటీనటులు బాల్యంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంటారు. విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ కలిసి నటించిన సినిమా నువ్వు నాకు నచ్చావ్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గానూ, అటు కామెడీ కమర్షియల్ గానూ నిలిచింది.
ఈ సినిమాలో ముఖ్యంగా వెంకటేష్, ఆర్తీ అగర్వాల్, ప్రకాష్ రాజ్ లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో పింకీ పాత్రకి కూడా అంతే క్రేజ్ వచ్చింది. కడుపుబ్బా నవ్వుకునేలా డైలాగ్స్ తో, యాక్షన్ కామెడీతో ప్రేక్షకులకు చేరువైంది. ముఖ్యంగా హీరో వెంకటేష్ తో చెప్పిన డైలాగ్స్ కి మంచి క్రేజ్ వచ్చింది. అలాగే ఈ సినిమాలో బ్రహ్మానందంతో చేసిన కామెడీ కూడా పాపులారిటీని సంపాదించుకుంది.
ఈమె అసలు పేరు సుదీప. కానీ నువ్వు నాకు నచ్చావ్ సినిమా నుండి పింకీగా పాపులారిటీ తెచ్చుకుంది. ఈమె పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. సుదీప పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జన్మించింది. ఈమె తల్లిదండ్రులు కళాకారుల కుటుంబానికి చెందిన వాళ్ళు.
ఆమె తాత కిలాడీ సత్యం. ప్రముఖ కళాకారుడు. ఆయనకు సినిమాల్లో ఎన్నో పరిచయాలు ఉండటంతో సుదీపను ఫస్ట్ టైమ్ 1994 లో మోహన్ బాబు యాక్ట్ చేసిన ఎం. ధర్మరాజు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ రంభ చెల్లెలిగా నటించింది.
ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసరాల్లో జరిగింది. ఆ టైమ్ లో ఓ చిన్నపాప రోల్ కావాలి. దీంతో డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి సుదీపను చూసి ఆ పాత్రకు అవకాశం ఇచ్చారు. నెక్ట్స్ అల్లుడుగారు వచ్చారు, మా అన్నయ్య లాంటి మూవీలలో సుదీప నటించింది.
నువ్వు నాకు నచ్చావ్ సినిమా నుండి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత స్టాలిన్, బిందాస్, మిస్టర్ పర్ఫెక్ట్, లెజెండ్ లాంటి సినిమాల్లో నటించింది. ఎంబీఏ పూర్తి చేసిన సుదీప.. శ్రీరంగనాథన్ అనే వ్యక్తిని పెళ్ళి చేసుకుని సెటిల్ అయ్యింది. బుల్లితెర సీరియల్స్ లో కూడా సుదీప యాక్ట్ చేసింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…