Srikanth : టాలీవుడ్లో గత కొంత కాలంగా పెద్దరికం గురించి తీవ్రమైన చర్చ జరుగుతున్న విషయం విదితమే. అందులో భాగంగానే మోహన్బాబు వర్గీయులు ఎప్పుడూ తామే పెద్ద అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదే విషయంపై నటుడు శ్రీకాంత్ తాజాగా స్పందించారు. టాలీవుడ్కు పెద్ద ముమ్మాటికీ చిరంజీవే అని.. ఆయనను మించి ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఈ మేరకు శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
టాలీవుడ్లో గత కొంత కాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చిరంజీవి ఎంతో కృషి చేస్తున్నారని.. ఆయనకు పెద్దగా ఉండడం ఇష్టం లేదని.. కానీ సినిమా వాళ్ల సమస్యలను పరిష్కరించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని గతంలోనే చెప్పారని.. ఇప్పుడు అదే చేస్తున్నారని.. కనుక ఆయన ఒప్పుకోకపోయినా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఆయనే అని శ్రీకాంత్ అన్నారు.
కాగా చిరంజీవి ఇటీవలి కాలంలో సినిమా రంగ సమస్యలపై అనేక సార్లు ఇరు రాష్ట్రాల సీఎంలతో సమావేశం అయ్యారు. ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల విషయంలో సీఎం జగన్ను ఇతర హీరోలతో కలిసి సమావేశం అయ్యారు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లు అయింది. అయితే సవరించిన ధరల ప్రకారం కొత్త జీవోను విడుదల చేయడంలో కొంత ఆలస్యం అవుతోంది. ఆ జీవో వస్తే.. ఎట్టకేలకు ఏపీలోనూ సినిమా టిక్కెట్ల ధరలు పెరుగుతాయని అంటున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…