Sri Reddy : తెలుగు సినీ ప్రేక్షకులకు నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో వార్తల్లో నిలిచింది. పవన్ కల్యాణ్ను దూషించి వార్తల్లోకి ఎక్కింది. ఆ తరువాత ఈమెకు పెద్దగా సపోర్ట్ లభించలేదు. దీంతోపాటు తెలుగులో అవకాశాలు కూడా రాలేదు. ఈ క్రమంలోనే శ్రీరెడ్డి చెన్నైకి మకాం మార్చింది. అక్కడి నుంచే ఆమె సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్కు టచ్లో ఉంటోంది. అలాగే తన యూట్యూబ్ చానల్లో రకరకాల వంటల వీడియోలను అప్లోడ్ చేస్తూ అలరిస్తోంది.
శ్రీరెడ్డి ఇప్పటికే తన యూట్యూబ్ చానల్లో ఎన్నో రకాల వంటలకు చెందిన వీడియోలను పోస్ట్ చేసింది. తనదైన శైలిలో పంచ్లు వేస్తూ.. పలు రకాల వంటకాలను వండుతూ ఆకట్టుకుంటోంది. అయితే శ్రీరెడ్డి తాజాగా తన ఇంటి టూర్కు చెందిన వీడియోను పోస్ట్ చేసింది. తన ఇంట్లోని గదులను చూపిస్తూ ఒక్కో గదిలోని ప్రత్యేకతలను వివరించింది. పలు రకాల సదుపాయాలను తాను తన ఇంట్లో ఎలా అమర్చుకున్నది వివరించింది. ఈ క్రమంలోనే తన ఇంటి టూర్కు చెందిన వీడియోను ఆమె పోస్ట్ చేయగా.. అది వైరల్ అవుతోంది.
ఇక శ్రీరెడ్డి ఇటీవలి కాలంలో పెద్దగా స్పందించడం లేదు. గతంలో టాలీవుడ్కు చెందిన వారిపై విరుచుకు పడేది. కానీ ఈమధ్య అలా మాట్లాడడం కాస్త తగ్గించింది. తన పనేంటో తాను చూసుకుంటూ బిజీగా ఉంటోంది. చికెన్, మటన్, చేపలు తదితర వంటలను వండుతూ.. మధ్య మధ్యలో రెస్టారెంట్లకు వెళ్లి ఫుడ్ను తిని వాటికి రేటింగ్స్ ఇస్తూ.. కాలక్షేపం చేస్తోంది. ఇక శ్రీరెడ్డి మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఉండదనే అనుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…