Sreemukhi : ఇటీవలే ముగిసిన వాలెంటైన్స్ డేను ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఘనంగా జరుపుకున్నారు. ఇక టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ప్రేమికుల దినోత్సవం రోజున ఎంజాయ్ చేశారు. జంటలుగా ఉన్నవారు ఒకరికొకరు ప్రేమ సందేశాలను పంపుకోగా.. జంటలుగా లేని వారికి తమ స్నేహితులు గ్రీటింగ్ కార్డులను పంపించారు. కాగా యాంకర్ శ్రీముఖికి కూడా అలాగే ఒకరు గ్రీటింగ్ కార్డును పంపించారు. అయితే ఆ పంపింది.. స్నేహితురాలా, స్నేహితుడా.. అన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రేమికుల దినోత్సవం రోజున శ్రీముఖికి ఎవరో ఒక వ్యక్తి పుష్ప గుచ్ఛం పంపగా.. ఆ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియజేసింది. పైగా ఆ పోస్ట్ కింద.. ఇది గుర్తు పెట్టుకోండి, మళ్లీ మాట్లాడుకుందాం, బెస్ట్ వాలెంటైన్స్ ఎవర్.. అంటూ కామెంట్ పెట్టింది. అంటే శ్రీముఖి ఏ వ్యక్తితో అయినా లవ్లో ఉందా.. అందుకనే అతను ఆమెకు ఇలా గులాబీ పువ్వులను పంపించాడా.. అని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక గతంలోనూ పలుమార్లు శ్రీముఖి ఇలాగే సస్పెన్స్తో కూడిన పోస్టులు పెట్టింది. దీంతో ఆమె ఎవరితోనో లవ్లో ఉందని.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. కానీ ఆమె ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక తాజాగా శ్రీముఖి చేసిన పోస్టుతో మరోమారు ఈమె పెళ్లి విషయం తెరపైకి వచ్చింది. పైగా వాలెంటైన్స్ డే రోజు పువ్వులు కూడా వచ్చాయి. దీంతో కచ్చితంగా ఈమె లవ్లో ఉందని అంటున్నారు. మరి శ్రీముఖి నిజంగానే లవ్లో పడిందా.. త్వరలోనే పెళ్లి చేసుకోనుందా.. అనే విషయాలు తెలియాలంటే.. ఇంకొంత కాలం వేచి చూడక తప్పదు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…