Sreemukhi : ఇటీవలే ముగిసిన వాలెంటైన్స్ డేను ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఘనంగా జరుపుకున్నారు. ఇక టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ప్రేమికుల దినోత్సవం రోజున ఎంజాయ్ చేశారు. జంటలుగా ఉన్నవారు ఒకరికొకరు ప్రేమ సందేశాలను పంపుకోగా.. జంటలుగా లేని వారికి తమ స్నేహితులు గ్రీటింగ్ కార్డులను పంపించారు. కాగా యాంకర్ శ్రీముఖికి కూడా అలాగే ఒకరు గ్రీటింగ్ కార్డును పంపించారు. అయితే ఆ పంపింది.. స్నేహితురాలా, స్నేహితుడా.. అన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రేమికుల దినోత్సవం రోజున శ్రీముఖికి ఎవరో ఒక వ్యక్తి పుష్ప గుచ్ఛం పంపగా.. ఆ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియజేసింది. పైగా ఆ పోస్ట్ కింద.. ఇది గుర్తు పెట్టుకోండి, మళ్లీ మాట్లాడుకుందాం, బెస్ట్ వాలెంటైన్స్ ఎవర్.. అంటూ కామెంట్ పెట్టింది. అంటే శ్రీముఖి ఏ వ్యక్తితో అయినా లవ్లో ఉందా.. అందుకనే అతను ఆమెకు ఇలా గులాబీ పువ్వులను పంపించాడా.. అని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక గతంలోనూ పలుమార్లు శ్రీముఖి ఇలాగే సస్పెన్స్తో కూడిన పోస్టులు పెట్టింది. దీంతో ఆమె ఎవరితోనో లవ్లో ఉందని.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. కానీ ఆమె ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక తాజాగా శ్రీముఖి చేసిన పోస్టుతో మరోమారు ఈమె పెళ్లి విషయం తెరపైకి వచ్చింది. పైగా వాలెంటైన్స్ డే రోజు పువ్వులు కూడా వచ్చాయి. దీంతో కచ్చితంగా ఈమె లవ్లో ఉందని అంటున్నారు. మరి శ్రీముఖి నిజంగానే లవ్లో పడిందా.. త్వరలోనే పెళ్లి చేసుకోనుందా.. అనే విషయాలు తెలియాలంటే.. ఇంకొంత కాలం వేచి చూడక తప్పదు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…