Sonu Sood : కష్టాల్లో, పేదరికంలో ఉన్న వాళ్లకు మొదట గుర్తుకు వచ్చే పేరు సోనూ సూద్. కరోనా వైరస్ ఉపద్రవం వచ్చినప్పటి నుండి ఈయన జాతీయ స్థాయిలో సమాజ సేవకి మారుపేరుగా గుర్తింపు పొందారు. కరోనా లాక్ డౌన్ వల్ల ఇతర ప్రాంతాల్లో చిక్కుకు పోయిన వలస జీవులను వాళ్ల సొంత ఊళ్లకు చేర్చడంతో మొదలైన ఆయన సేవలు.. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడం.. వారి ఆకలి తీర్చడం, హాస్పిటల్స్ లో ఆక్సిజన్ కొరత తీర్చడం.. ఇలా ఎన్నో విధాలుగా కష్టాల్లో ఉన్న వాళ్లను ఆదుకున్నారు. దీని కోసం ఆయన తన సొంత డబ్బుని ఎంతో ఖర్చు చేశారు.
అయితే ఇప్పటికీ రకరకాల ఇబ్బందుల్లో ఉన్న ప్రజలు వందల మంది ప్రతి రోజూ ఆయన ఇంటిముందు ఎదురు చూస్తూ ఉంటున్నారు. తమ సమస్యలను ఆయనతో చెప్పుకొని ఆ కష్టాల నుండి తమని బయట పడేయడానికి సాయం చేయమని అడుగుతుంటారు. ఇలాగే అలాంటి వాళ్లందరూ సోనూ సూద్ ఇంటి ముందు సాయం కోసం క్యూలో నిలబడిన వీడియో ఒకటి ఈ మధ్య సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఇక ఇదే విషయంలో సోనూ సూద్ ఒక ఇంగ్లిష్ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. ఇది తనకు అలవాటై పోయిందని.. ఇలా వారానికి 5 రోజులు ప్రతి రోజూ150 నుండి 200 మంది ప్రజలు సాయం కోసం వస్తారని, ఇక వారాంతాల్లో అయితే 500 నుండి 700 మంది వరకు వస్తారని అన్నారు. ఇదే విధంగా సోషల్ మీడియా ద్వారా రోజూ 30వేల నుండి 40వేల వరకు అభ్యర్థనలు వస్తాయని వివరించారు.
ఇలా ప్రతి రోజూ తన ఇంటి ముందు జనం పోగవడం వల్ల భద్రతా పరమైన సమస్యలు వచ్చే అవకాశం లేదా అని ఛానల్ ప్రతినిధి అడగ్గా.. అలాంటిదేం లేదని, నిజానికి ఆ సొసైటీలోని చుట్టు పక్కల నివాసం ఉండే వారు చాలా సహకరిస్తారని, వాళ్లు కూడా అప్పుడప్పుడూ సాయం కోసం తనని సంప్రదిస్తారని, ఇక్కడ సహాయం కోసం వచ్చిన వారు ఖాళీ చేతులతో వెళ్లరని వారికి కూడా తెలుసని.. చెప్పారు.
అయితే.. ఇలా లెక్కలేనన్ని వినతులు రావడం వల్ల మీకు మానసిక ఒత్తిడి లాంటివి కలగవా అని ప్రశ్నించగా.. దానికి సోనూసూద్ అలా ఎప్పుడూ అనిపించలేదని.. ఒక విధంగా ఇదంతా సమాజం పట్ల, సమస్యల్లో ఉన్నవారి పట్ల తన భాధ్యతను మరింత పెంచుతుందని, ఇంకా పెద్ద ఎత్తున సేవ చేయడానికి స్ఫూర్తిని ఇస్తుందని తెలియజేశారు. ఈ క్రమంలోనే సోనూ సూద్ చేసిన ఈ కామెంట్స్కు అందరూ ఆయనను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…