Sonu Sood : కష్టాల్లో, పేదరికంలో ఉన్న వాళ్లకు మొదట గుర్తుకు వచ్చే పేరు సోనూ సూద్. కరోనా వైరస్ ఉపద్రవం వచ్చినప్పటి నుండి ఈయన జాతీయ స్థాయిలో సమాజ సేవకి మారుపేరుగా గుర్తింపు పొందారు. కరోనా లాక్ డౌన్ వల్ల ఇతర ప్రాంతాల్లో చిక్కుకు పోయిన వలస జీవులను వాళ్ల సొంత ఊళ్లకు చేర్చడంతో మొదలైన ఆయన సేవలు.. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడం.. వారి ఆకలి తీర్చడం, హాస్పిటల్స్ లో ఆక్సిజన్ కొరత తీర్చడం.. ఇలా ఎన్నో విధాలుగా కష్టాల్లో ఉన్న వాళ్లను ఆదుకున్నారు. దీని కోసం ఆయన తన సొంత డబ్బుని ఎంతో ఖర్చు చేశారు.
అయితే ఇప్పటికీ రకరకాల ఇబ్బందుల్లో ఉన్న ప్రజలు వందల మంది ప్రతి రోజూ ఆయన ఇంటిముందు ఎదురు చూస్తూ ఉంటున్నారు. తమ సమస్యలను ఆయనతో చెప్పుకొని ఆ కష్టాల నుండి తమని బయట పడేయడానికి సాయం చేయమని అడుగుతుంటారు. ఇలాగే అలాంటి వాళ్లందరూ సోనూ సూద్ ఇంటి ముందు సాయం కోసం క్యూలో నిలబడిన వీడియో ఒకటి ఈ మధ్య సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఇక ఇదే విషయంలో సోనూ సూద్ ఒక ఇంగ్లిష్ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. ఇది తనకు అలవాటై పోయిందని.. ఇలా వారానికి 5 రోజులు ప్రతి రోజూ150 నుండి 200 మంది ప్రజలు సాయం కోసం వస్తారని, ఇక వారాంతాల్లో అయితే 500 నుండి 700 మంది వరకు వస్తారని అన్నారు. ఇదే విధంగా సోషల్ మీడియా ద్వారా రోజూ 30వేల నుండి 40వేల వరకు అభ్యర్థనలు వస్తాయని వివరించారు.
ఇలా ప్రతి రోజూ తన ఇంటి ముందు జనం పోగవడం వల్ల భద్రతా పరమైన సమస్యలు వచ్చే అవకాశం లేదా అని ఛానల్ ప్రతినిధి అడగ్గా.. అలాంటిదేం లేదని, నిజానికి ఆ సొసైటీలోని చుట్టు పక్కల నివాసం ఉండే వారు చాలా సహకరిస్తారని, వాళ్లు కూడా అప్పుడప్పుడూ సాయం కోసం తనని సంప్రదిస్తారని, ఇక్కడ సహాయం కోసం వచ్చిన వారు ఖాళీ చేతులతో వెళ్లరని వారికి కూడా తెలుసని.. చెప్పారు.
అయితే.. ఇలా లెక్కలేనన్ని వినతులు రావడం వల్ల మీకు మానసిక ఒత్తిడి లాంటివి కలగవా అని ప్రశ్నించగా.. దానికి సోనూసూద్ అలా ఎప్పుడూ అనిపించలేదని.. ఒక విధంగా ఇదంతా సమాజం పట్ల, సమస్యల్లో ఉన్నవారి పట్ల తన భాధ్యతను మరింత పెంచుతుందని, ఇంకా పెద్ద ఎత్తున సేవ చేయడానికి స్ఫూర్తిని ఇస్తుందని తెలియజేశారు. ఈ క్రమంలోనే సోనూ సూద్ చేసిన ఈ కామెంట్స్కు అందరూ ఆయనను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…