Shriya Sharma : మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాలో మెగాస్టార్ మేనకోడలిగా నటించిన శ్రియా శర్మ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ మూవీలో చిరంజీవి సరసన భూమిక, సమీరా రెడ్డి హీరోయిన్లుగా నటించారు. చిత్రంలో చిరంజీవి మేనకోడలు ఒక చిన్నారి పాప ఎంతో అద్భుతంగా నటించింది. ఆ చిన్నారి పాప పేరు శ్రీయ శర్మ. శ్రీయ శర్మ తన ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. నువ్వు నేను ప్రేమ చిత్రంతో శ్రీయశర్మ చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. అయితే ఆ చిత్రంలో సూర్య, జ్యోతిక కూతురిగా నటించింది శ్రీయ.
ఆ తరువాత చైల్డ్ ఆర్టిస్ట్గా తెలుగుతోపాటు తమిళ, కన్నడ, హిందీ ఇలా దాదాపు అన్ని భాషల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నది. టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన మహేష్బాబు సినిమా దూకుడు చిత్రంలో కూడా సమంత చెల్లి పాత్రలో నటించింది. అదేవిధంగా తెలుగు సినిమాలు అయిన రచ్చ, తూనీగ తూనీగ వంటి సినిమాల్లో టీనేజీ అమ్మాయిగా కనిపించి అందరినీ ఆకట్టుకుంది.
టీనేజ్ అమ్మాయి పాత్రలు చేస్తున్న సమయంలోనే హీరోయిన్గా చేసే చాన్స్ వచ్చింది. అదేవిధంగా 2014లో బిగ్బాస్తో ఫేమస్ అయిన అలీరాజా హీరోగా తెరకెక్కిన గాయకుడు సినిమాలో శ్రీయశర్మ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ గాయకుడు సినిమా ఆశించిన విజయం విజయం సాధించలేకపోయింది. ఆ తరువాత హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్కు జోడీగా నిర్మల కాన్వెంట్ అనే చిత్రంలో కూడా నటించింది.
ఆ చిత్రం తరువాత శ్రీయశర్మ తన దృష్టిని మోడలింగ్పై పెట్టింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే శ్రీయ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. తన గ్లామర్ ఫోటోస్ తో అందరినీ ఆకట్టుకున్నా కూడా శ్రీయశర్మకు మాత్రం సినిమాల్లో మంచి అవకాశాలు దక్కడం లేదు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…