Shriya Sharma : మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాలో మెగాస్టార్ మేనకోడలిగా నటించిన శ్రియా శర్మ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ మూవీలో చిరంజీవి సరసన భూమిక, సమీరా రెడ్డి హీరోయిన్లుగా నటించారు. చిత్రంలో చిరంజీవి మేనకోడలు ఒక చిన్నారి పాప ఎంతో అద్భుతంగా నటించింది. ఆ చిన్నారి పాప పేరు శ్రీయ శర్మ. శ్రీయ శర్మ తన ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. నువ్వు నేను ప్రేమ చిత్రంతో శ్రీయశర్మ చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. అయితే ఆ చిత్రంలో సూర్య, జ్యోతిక కూతురిగా నటించింది శ్రీయ.
ఆ తరువాత చైల్డ్ ఆర్టిస్ట్గా తెలుగుతోపాటు తమిళ, కన్నడ, హిందీ ఇలా దాదాపు అన్ని భాషల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నది. టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన మహేష్బాబు సినిమా దూకుడు చిత్రంలో కూడా సమంత చెల్లి పాత్రలో నటించింది. అదేవిధంగా తెలుగు సినిమాలు అయిన రచ్చ, తూనీగ తూనీగ వంటి సినిమాల్లో టీనేజీ అమ్మాయిగా కనిపించి అందరినీ ఆకట్టుకుంది.
టీనేజ్ అమ్మాయి పాత్రలు చేస్తున్న సమయంలోనే హీరోయిన్గా చేసే చాన్స్ వచ్చింది. అదేవిధంగా 2014లో బిగ్బాస్తో ఫేమస్ అయిన అలీరాజా హీరోగా తెరకెక్కిన గాయకుడు సినిమాలో శ్రీయశర్మ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ గాయకుడు సినిమా ఆశించిన విజయం విజయం సాధించలేకపోయింది. ఆ తరువాత హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్కు జోడీగా నిర్మల కాన్వెంట్ అనే చిత్రంలో కూడా నటించింది.
ఆ చిత్రం తరువాత శ్రీయశర్మ తన దృష్టిని మోడలింగ్పై పెట్టింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే శ్రీయ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. తన గ్లామర్ ఫోటోస్ తో అందరినీ ఆకట్టుకున్నా కూడా శ్రీయశర్మకు మాత్రం సినిమాల్లో మంచి అవకాశాలు దక్కడం లేదు.
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…