Shekar Movie : యాంగ్రీ యంగ్మ్యాన్గా పేరుగాంచిన రాజశేఖర్ చాలా రోజుల తరువాత నటించిన చిత్రం.. శేఖర్. ఈ మూవీకి స్వయంగా ఆయన భార్య జీవిత దర్శకత్వం వహించారు. అలాగే స్క్రిప్ట్, రీ-రికార్డింగ్ వంటి పనులను వారి కుమార్తెలు శివాని, శివాత్మికలు పర్యవేక్షించారు. ఈ క్రమంలోనే ఈ మూవీ నెల 20వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ఈ మూవీకి బ్రేక్ పడింది. కోర్టు ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే అసలు ఇందుకు కారణాలు ఏమిటి ? అన్న విషయానికి వస్తే..
ఫైనాన్షియర్ పరంధామరెడ్డి గతంలో హైదరాబాద్లోని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. జీవిత రాజశేఖర్ తమకు డబ్బులు ఇవ్వాలని.. ఎంత అడిగినా ఇవ్వడం లేదని చెప్పి ఆయన కోర్టులో కేసు వేశారు. దీంతో కోర్టు డబ్బులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికీ డబ్బులు చెల్లించకపోవడంతో శేఖర్ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. శాటిలైట్, థియేటర్, ఓటీటీ.. చివరకు యూట్యూబ్లో కూడా శేఖర్ మూవీని ప్రదర్శించకూడదని కోర్టు చెప్పింది. దీంతో జీవిత రాజశేఖర్లకు గట్టి దెబ్బ తగిలింది.
అయితే ఈ విషయంపై రాజశేఖర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. శేఖర్ సినిమా కోసం ఉన్నదంతా అమ్మి పెట్టామని.. అదే తమ సర్వస్వమని అన్నారు. ఈ సినిమాను నిర్మించేందుకు చాలా కష్టపడ్డామన్నారు. దీనికి విశేష రీతిలో ఆదరణ లభిస్తుందన్నారు. ఎవరో తమపై కక్ష గట్టి కావాలనే సినిమా ప్రదర్శను నిలిపివేయిస్తున్నారని.. అయితే ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా సినిమా ప్రదర్శన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇక కోర్టు ఆదేశాలతో ఇప్పటికే థియేటర్లలో శేఖర్ సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…