SBI : దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ వినియోగదారులకు ఆ బ్యాంక్ ఓ ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేసింది. ఇకపై ఆ బ్యాంకు కస్టమర్లు ఏటీఎంలలో నుంచి డబ్బులను విత్డ్రా చేయాలంటే తప్పక ఓటీపీతో వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఏటీఎంలలో మోసాలు పెరుగుతున్నందునే ఈ తరహా పద్ధతిని అమలు చేస్తున్నట్లు ఎస్బీఐ తెలియజేసింది. కాగా రూ.10వేలు అంతకన్నా మించిన నగదును విత్డ్రా చేస్తేనే ఓటీపీని ఎంటర్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఎంత మొత్తాన్ని విత్డ్రా చేసినా సరే తప్పక ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఎస్బీఐ కస్టమర్లు తమకు కావల్సిన మొత్తాన్ని ఏటీఎంలో ఎంటార్ చేశాక.. పిన్ నంబర్తో కన్ఫామ్ చేయాలి. తరువాత మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తేనే ఇకపై డబ్బును విత్డ్రా చేయగలుగుతారు. ఈ విషయాన్ని ఎస్బీఐ తాజాగా వెల్లడించింది. ఇక ఎస్బీఐకి చెందిన ఏటీఎం సేవలను వాడుకోవాలంటే గతంలో అపరిమిత లావాదేవీలు చేసుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు వాటిపై పరిమితులను విధించారు. దీని వల్ల ఏటీఎంలలోంచి అధిక సార్లు డబ్బును విత్డ్రా చేస్తామంటే కుదరదు. అందుకు చార్జిలను చెల్లించాల్సి ఉంటుంది.
ఇక అకౌంట్లో నెలవారీగా రూ.1 లక్ష అంతకన్నా ఎక్కువ మొత్తాన్ని మెయింటెయిన్ చేసేవారు మెట్రో నగరాల్లో ఉంటే వారు ఎస్బీఐ ఏటీఎంలలో నుంచి నెలకు 5 సార్లు ఉచితంగా డబ్బును విత్డ్రా చేయవచ్చు. అదే ఇతర బ్యాంకుల ఏటీఎంలను వాడితే 3 లావాదేవీలను మాత్రమే ఉచితంగా అందిస్తారు. ఇక పరిమితికి మించిన తరువాత ఒక్కో ఏటీఎం లావాదేవీకి రూ.10 వరకు చార్జి చేస్తారు. అదే ఇతర బ్యాంకుల ఏటీఎంలలో అయితే రూ.20 చార్జి చేస్తారు. ఇక డబ్బు విత్డ్రా కాకుండా ఇతర లావాదేవీలు అయితే ఎస్బీఐ ఏటీఎంలలో ఎస్బీఐ కస్టమర్లకు పరిమితి మించి లావాదేవీలకు గాను ఒక్కోదానికి రూ.5 వసూలు చేస్తారు. అదే ఇతర ఏటీఎంలను ఎస్బీఐ కస్టమర్లు వాడితే పరిమితికి మించితే.. ఒక్కో ఇతర లావాదేవీకి రూ.8 వరకు వసూలు చేస్తారు. ఇలా ఎస్బీఐ కస్టమర్లు చార్జిలను దృష్టిలో పెట్టుకుని ఏటీఎంలలో నుంచి డబ్బును విత్డ్రా చేయాల్సి ఉంటుంది. లేదంటే చార్జిలను చెల్లించక తప్పదు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…