Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట మూవీ నేడు (గురువారం మే 12, 2022) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటించింది. ఈ క్రమంలోనే యూఎస్ఏలో ఇప్పటికే సినిమాకు ప్రీమియర్స్ పడ్డాయి. ఇక ఇండియాలోనూ ఉదయం 4 గంటలకే బెనిఫిట్ షోలను ప్రారంభించారు. దీంతో 7 గంటల వరకు రివ్యూలు వచ్చేశాయి. ఈ క్రమంలోనే మూవీ పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. రివ్యూలు కూడా పాజిటివ్గానే వస్తున్నాయి. అయితే ఈ మూవీ విడుదలై ఇంకా ఒక్క రోజు కూడా కాలేదు.. అప్పుడే ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా.. అని ప్రేక్షకులు ఆరాలు తీస్తున్నారు. అయితే దీనిపై కూడా అప్డేట్ వచ్చేసింది.
సర్కారు వారి పాట మూవీకి గాను మొదట్లో డిస్నీప్లస్ హాట్ స్టార్ డిజిటల్ హక్కులను కొనుగోలు చేసిందని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఆ హక్కులను సాధించింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. దీంతో అమెజాన్ ప్రైమ్లోనే సర్కారు వారి పాట రిలీజ్ కానుంది. ఇక సినిమా విడుదల అయ్యాక నెల రోజులకు.. అంటే జూన్ 12వ తేదీ తరువాత ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుందని తెలుస్తోంది.
అయితే సర్కారు వారి పాట సినిమా శాటిలైట్ హక్కులను స్టార్ మా సొంతం చేసుకుంది. దీంతో ఆ టీవీలో ఈ మూవీ ప్రసారం అవుతుంది. అయితే అంతకన్నా ముందే ఓటీటీలో ఈ మూవీ వస్తుంది కనుక టీవీల్లో చూసేందుకు పెద్దగా ఆసక్తిని చూపించరు. అయినప్పటికీ మూవీ బాగుందని టాక్ వస్తుంది కనుక.. టీవీలోనూ ఈ సినిమాకు రేటింగ్స్ వస్తాయని అంటున్నారు. ఇక సర్కారు వారి పాటకు అన్ని సెంటర్లలోనూ మంచి టాక్ వస్తోంది. దీంతో మహేష్ ఇంకో హిట్ సాధించారని అంటున్నారు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…