Sarkaru Vaari Paata : వరుస సినిమాలతో అలరిస్తున్న మహేష్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతుండగా.. మే 12న చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్ చేస్తున్నారు. పోకిరి స్టైల్లో ఈ సినిమా ఉండనుందని తాజాగా విడుదలైన ట్రైలర్ ను చూసి అందరూ ఊహాలోచనలు చేస్తున్నారు. మహేష్ యాక్టింగ్, మేనరిజంలో మోనాటమీ పెరిగిపోయిందనే భావనను మహేష్ సర్కారు వారి పాట చిత్రంలో బ్రేక్ చేసినట్లు కనిపిస్తోంది. ఆయనను దర్శకుడు గతంలో ఎన్నడూ చూడని ఊరమాస్ అవతార్ లో ప్రెజెంట్ చేసినట్లు తెలుస్తోంది.
డైరెక్టర్ పరశురామ్ సర్కారు వారి పాట రూపంలో పర్ఫెక్ట్ మాస్ ప్యాకేజ్ అందించబోతున్నారు. ఇందులో మహేష్ తన డైలాగ్స్, కామెడీ టైమింగ్, యాక్షన్ తో అదరగొట్టేస్తున్నాడు. ట్రైలర్ మాత్రం మాంచి ఫీస్ట్గా ఉంది. అయితే ఈ సినిమా కథ లీకైనట్టు వార్తలు వస్తున్నాయి. లీకైన సర్కారు వారి పాట చిత్ర కథ ప్రకారం.. మహేష్ బాబు ఫారెన్ లో ఉంటూ అప్పులు ఇస్తుంటాడు. ఎగ్గొట్టేవారి దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తుంటాడు. అనుకోని పరిస్థితితుల వల్ల మహేష్ బాబు హీరోయిన్ తో కలిసి ఇండియాకు రావాల్సి వస్తుంది.
ఓ ఆపరేషన్లో భాగంగా విలన్ గ్యాంగ్ లో చేరతాడు మహేష్. విలన్స్ గ్యాంగ్ లో ఎందుకు చేరాల్సి వచ్చింది అనేది కథలో అసలైన ట్విస్ట్. మహేష్ బాబుకి తన తండ్రి రూపంలో ప్లాష్ బ్యాక్ ఉంటుంది. మహేష్ తండ్రి ఇలాగే అప్పులు ఎక్కువగా ఇచ్చి మోసపోయి ఉండవచ్చు. అతడి ఫ్యామిలీ వీధిన పడ్డప్పుడు ఊహించని విషాదం జరిగి ఉండొచ్చు. తన తండ్రికి జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని మహేష్ డబ్బు విషయంలో ఇంత కఠినంగా ఉంటాడని అనుకుంటున్నారు. సమాజంలో జరుగుతున్న పరిస్థతులని దృష్టిలో పెట్టుకొని పరశురాం ఈ కథని రాసుకున్నాడేమో.. అని కొందరు అనుకుంటున్నారు. అయితే చిత్ర కథ ఇదేనంటూ లీకైతే అయింది. కానీ సినిమా విడుదలయ్యాకే అసలు కథ గురించి తెలుస్తుంది. కనుక అప్పటి వరకు వేచి చూడాల్సిందే.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవకతవకలు వరుసగా బయటపడుతున్నాయని, తాజాగా రూ.6 వేల కోట్ల విలువైన…
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా…
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో…
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…