Sara Tendulkar : క్రికెట్, సినిమా రంగాలకి చెందిన ప్రముఖుల పిల్లలు వెండితెర ఎంట్రీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా.. కొంతమంది సక్సెస్ అయ్యారు. మరి కొంత మంది నిరాశపరిచారు. అయితే క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా కూడా ఇప్పుడు వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సెలబ్రిటీ కిడ్ అయిన ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య భారీగానే ఉంది.
సారా టెండూల్కర్కి ఇన్స్టాగ్రామ్లో 1.8 మిలియన్ల ఫాలోవర్లున్నారంటే క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సారా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అవుతుందన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. బీటౌన్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం సారా హిందీలో డెబ్యూ మూవీ చేసేందుకు రెడీ అవుతోందట. సినిమాల్లో నటించాలనే తన కోరికకు సారా టెండూల్కర్ తల్లిదండ్రులు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ స్టార్ నటుడు షాహిద్ కపూర్ సినిమా ద్వారా సారా హీరోయిన్ గా అరంగేట్రం చేయనుందని తెలుస్తోంది. అయితే దీనిపై సారా తండ్రి సచిన్ స్పందించారు. అది పుకారేనని కొట్టిపారేశారు. ప్రస్తుతం తన కుమార్తె విద్యాభ్యాసం చేస్తోందని.. ఇప్పటికైతే సినిమాల్లో నటించే అవకాశం లేదని సచిన్ అన్నారు. యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్ తో సారా టెండూల్కర్ ప్రేమాయణం సాగిస్తుందని గతంలో ప్రచారం జరిగింది. వీరిద్దరూ ప్రస్తుతం ప్రేమలో మునిగి తేలుతున్నారని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…