Sankranthi 2022 : సంక్రాంతి పండుగకు ప్రతి ఇంట్లోనూ సందడి నెలకొంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు తెలుగు వారు ఎక్కడ ఉన్నా సరే ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడంతోపాటు ఉత్తరాయణంలోకి వస్తాడు. అందుకనే ఈ రోజును మకర సంక్రాంతి అని పిలుస్తారు. ఈ క్రమంలోనే సంక్రాతి పండుగ రోజు ఎక్కడ చూసినా తెలుగు వారి వాకిళ్లన్నీ రంగు రంగుల రంగవల్లికలు, గొబ్బెమ్మలతో దర్శనమిస్తుంటాయి.
ఇక సంక్రాంతి పండుగకు ఎంతో హడావిడి ఉంటుంది. రైతులకు పంట చేతికి వస్తుంది. ప్రతి ఇంట్లోనూ ఆనందాలు నెలకొంటాయి. పిండి వంటలను ఆరగిస్తూ, పతంగులను ఎగుర వేస్తూ ఉత్సాహంగా పండుగను జరుపుకుంటారు. ఇక ఈ ఏడాది సంక్రాంతి పండుగ జనవరి 15వ తేదీన వచ్చింది.
జనవరి 15న మధ్యాహ్నం 2.43 గంటల నుంచి సాయంత్రం 5.45 గంటల వరకు దివ్యమైన ముహుర్తం ఉంది. అందువల్ల ఈ సమయం పూజలకు, కొత్త పనులు, వ్యాపారాలు ప్రారంభించేందుకు అనువైందని చెబుతున్నారు. ఇక సంక్రాంతి రోజు పలు కార్యక్రమాలు చేయడం వల్ల సకల సంపదలు కలగడంతోపాటు అన్ని సమస్యలు తొలగిపోయి కుటుంబంలో సంతోషాలు నెలకొంటాయని, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. కనుక సంక్రాంతి రోజు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సంక్రాంతి రోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి ఆరెంజ్ కలర్ దుస్తులను ధరించాలి. దీంతో శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఇల్లంతా శుభ్రం చేసి గడపకు పసుపు, కుంకుమ రాయాలి. గుమ్మానికి మామిడి ఆకుల తోరణాలను అలంకరించాలి. పూల తోరణాలను కట్టాలి. దీని వల్ల ఇంట్లో ఉండు చెడు ప్రభావం తొలగిపోతుంది. మంచి ప్రభావం ఏర్పడుతుంది.
సంక్రాంతి రోజు ఇంట్లోని పూజ గది లేదా మందిరాన్ని అలంకరించుకోవాలి. పితృ దేవతలకు పూజలు చేయాలి. దీంతో వారి ఆశీస్సులు లభిస్తాయి. చేసే పనిలో తిరుగుండదు. లాభాలను ఆర్జిస్తారు. సంక్రాంతి రోజు మహిళలు పువ్వులు, పసుపు, కుంకుమ, బెల్లం, పండ్లను దానం చేయడం వల్ల సకల సంపదలు లభిస్తాయి. అలాగే మహిళలకు దీర్ఘసుమంగళి ప్రాప్తం కలుగుతుంది.
పండుగ నాడు ఆడపడుచులను, అల్లుళ్లను ఇంటికి ఆహ్వానించి వారికి బట్టలు పెట్టాలి. దీంతో వారి కాపురం కలహాలు లేకుండా సాగుతుంది. అలాగే యాచకులకు అన్నదానం చేయాలి. దీంతో పుణ్యం లభిస్తుంది. ఎవరితోనూ గొడవలు, కొట్లాటలు పెట్టుకోకుండా సంతోషంగా ఉండాలి. దీని వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…