Sankranthi 2022 : సంక్రాంతి పండుగకు ప్రతి ఇంట్లోనూ సందడి నెలకొంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు తెలుగు వారు ఎక్కడ ఉన్నా సరే ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడంతోపాటు ఉత్తరాయణంలోకి వస్తాడు. అందుకనే ఈ రోజును మకర సంక్రాంతి అని పిలుస్తారు. ఈ క్రమంలోనే సంక్రాతి పండుగ రోజు ఎక్కడ చూసినా తెలుగు వారి వాకిళ్లన్నీ రంగు రంగుల రంగవల్లికలు, గొబ్బెమ్మలతో దర్శనమిస్తుంటాయి.
ఇక సంక్రాంతి పండుగకు ఎంతో హడావిడి ఉంటుంది. రైతులకు పంట చేతికి వస్తుంది. ప్రతి ఇంట్లోనూ ఆనందాలు నెలకొంటాయి. పిండి వంటలను ఆరగిస్తూ, పతంగులను ఎగుర వేస్తూ ఉత్సాహంగా పండుగను జరుపుకుంటారు. ఇక ఈ ఏడాది సంక్రాంతి పండుగ జనవరి 15వ తేదీన వచ్చింది.
జనవరి 15న మధ్యాహ్నం 2.43 గంటల నుంచి సాయంత్రం 5.45 గంటల వరకు దివ్యమైన ముహుర్తం ఉంది. అందువల్ల ఈ సమయం పూజలకు, కొత్త పనులు, వ్యాపారాలు ప్రారంభించేందుకు అనువైందని చెబుతున్నారు. ఇక సంక్రాంతి రోజు పలు కార్యక్రమాలు చేయడం వల్ల సకల సంపదలు కలగడంతోపాటు అన్ని సమస్యలు తొలగిపోయి కుటుంబంలో సంతోషాలు నెలకొంటాయని, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. కనుక సంక్రాంతి రోజు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సంక్రాంతి రోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి ఆరెంజ్ కలర్ దుస్తులను ధరించాలి. దీంతో శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఇల్లంతా శుభ్రం చేసి గడపకు పసుపు, కుంకుమ రాయాలి. గుమ్మానికి మామిడి ఆకుల తోరణాలను అలంకరించాలి. పూల తోరణాలను కట్టాలి. దీని వల్ల ఇంట్లో ఉండు చెడు ప్రభావం తొలగిపోతుంది. మంచి ప్రభావం ఏర్పడుతుంది.
సంక్రాంతి రోజు ఇంట్లోని పూజ గది లేదా మందిరాన్ని అలంకరించుకోవాలి. పితృ దేవతలకు పూజలు చేయాలి. దీంతో వారి ఆశీస్సులు లభిస్తాయి. చేసే పనిలో తిరుగుండదు. లాభాలను ఆర్జిస్తారు. సంక్రాంతి రోజు మహిళలు పువ్వులు, పసుపు, కుంకుమ, బెల్లం, పండ్లను దానం చేయడం వల్ల సకల సంపదలు లభిస్తాయి. అలాగే మహిళలకు దీర్ఘసుమంగళి ప్రాప్తం కలుగుతుంది.
పండుగ నాడు ఆడపడుచులను, అల్లుళ్లను ఇంటికి ఆహ్వానించి వారికి బట్టలు పెట్టాలి. దీంతో వారి కాపురం కలహాలు లేకుండా సాగుతుంది. అలాగే యాచకులకు అన్నదానం చేయాలి. దీంతో పుణ్యం లభిస్తుంది. ఎవరితోనూ గొడవలు, కొట్లాటలు పెట్టుకోకుండా సంతోషంగా ఉండాలి. దీని వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…