Samantha : ఏ మాయ చేశావే చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత.. ఒక్క సినిమాతోనే పాపులర్ అయింది. యువతను తన వైపు తిప్పుకుంది. ఈ సినిమాలో సమంత యాక్టింగ్కు ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. ఈ క్రమంలోనే ఆమెకు ఏకంగా అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ అయింది. ఇక ఆ తరువాత ఈ అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈమె సినీ లైఫ్ అద్భుతంగా మారిపోయింది. ఎంతలా అంటే.. ప్రతి హీరో సమంతతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించాడు. అలా డైరెక్టర్లు, నిర్మాతల పాలిట ఈమె అదృష్ట దేవతగా మారింది. ఇక సమంత తక్కువ టైంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్కు చేరుకుంది. దక్షిణాదిలో ఈమె దాదాపుగా స్టార్ హీరోలందరితోనూ నటించింది. అంతే కాకుండా తన నటన, హావభావాలతో లక్షలాది మంది ఫాలోవర్లను సొంతం చేసుకుంది. ఈమె దూకుడు మామూలుగా లేదు.
అయితే కెరీర్ పీక్ టైమ్లో ఉండగానే నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తరువాత అక్కినేని కోడలిగా మారింది. అయితే ప్రేమించినంత కాలమైనా పెళ్లి బంధాన్ని నిలుపుకోలేదు. నాలుగేళ్లకే వీరి మధ్య గొడవలు రాగా అవి విడాకుల వరకు దారి తీశాయి. ఈ క్రమంలోనే సమంత బాధ పడుతూ కూర్చోకుండా.. విడాకుల తరువాత కూడా వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక సినిమాలు చేస్తూనే మరోవైపు ఖాళీ సమయంలో తనకు నచ్చిన ప్రదేశాలకి వెళ్తూ ఎంజాయ్ చేస్తోంది. అక్కడి ఫోటోలను కూడా షేర్ చేస్తోంది. అయితే ఈమధ్య కాలంలో సమంత సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉండడం లేదు.
ఇక సమంత గతంలో ఓ విషయాన్ని తెలియజేసింది. తనకు చిన్నప్పటి నుండి స్వీట్స్ కన్నా ఐస్ క్రీమ్ అంటేనే చాలా ఇష్టమని చెప్పింది. గడ్డకట్టే చలిలో తనకు ఇష్టమైన వ్యక్తితో కలిసి.. ఐస్ క్రీమ్ ను షేర్ చేసుకుని తినాలనే కోరిక ఉండేదని చెప్పింది. అయితే పెళ్లయాక స్విట్జర్లాండ్కు వెళ్లి చైతూతో ఇలాగే చేద్దామని ప్లాన్ వేసిందట. కానీ వీలు కాలేదు. అయితే ఆ తరువాత మళ్లీ వీరు అక్కడికి వెళ్లలేదు. తరువాత వీరు విడాకులు తీసుకున్నారు. దీంతో సమంత కోరిక నెరవేరకుండానే పోయింది. అయితే సింగిల్గానైనా సరే స్విట్జర్లాండ్కు వెళ్లి తన కోరికను నెరవేర్చుకుంటుందా.. లేదా.. అన్నది చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…