Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకున్న అనంతరం సమంత తన కెరీర్పైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. అందులో భాగంగానే వరుస సినిమాలకు సంతకాలు చేస్తోంది. ఇక పుష్ప కోసం ప్రత్యేక సాంగ్లోనూ కనిపించనుంది. అందుకుగాను ఈమె భారీ మొత్తంలో తీసుకుంటున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
ఇక సోషల్ మీడియాలో సమంత ఎల్లప్పుడూ యాక్టివ్గానే ఉంటోంది. కొటేషన్స్ షేర్ చేయడంతోపాటు తనకు సంబంధించిన కార్యక్రమాల వివరాలను సోషల్ ఖాతాల్లో పోస్ట్ చేస్తోంది. అయితే విడాకుల ప్రకటన చేసిన తరువాత ఇన్ని రోజులకు సమంత మరోమారు అక్కినేని కాంపౌండ్లో అడుగు పెట్టింది. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ అవుతోంది.
అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోకు సమంత వచ్చినట్లుగా తెలుస్తోంది. నాగచైతన్యతో విడాకులను ప్రకటించిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోకు ఆమె మొదటిసారిగా వచ్చింది. ఇటీవల గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాలో ఆమె నటించింది. కాగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.
కాగా ఈ మూవీ డబ్బింగ్ వర్క్ పూర్తి చేసేందుకు సమంత అన్నపూర్ణ స్టూడియోకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుండగా.. ఆమె వాటిని పరిశీలించేందుకు వెళ్లినట్లు సమాచారం. ఆమె తన సినిమాలకు డబ్బింగ్ చెప్పుకోదు. సింగర్ చిన్మయి చెబుతుంది. అయినప్పటికీ కొన్ని సార్లు స్టార్స్ తమ డబ్బింగ్ పనుల్లో పాల్గొంటారు. సమంత కూడా అందుకనే వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇక నాగచైతన్య పుట్టినరోజున అతనికి బర్త్ డే విషెస్ చెప్పలేదు. కానీ తన కుక్క బర్త్ డేకు ఏకంగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో సమంతపై అక్కినేని ఫ్యాన్స్ మండి పడుతున్నారు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…