Sai Pallavi : టాలీవుడ్, కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డమ్ అందుకున్న హీరోయిన్ సాయి పల్లవి. ప్రేమమ్ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల్ని ఫిదా చేసింది. సాయిపల్లవి లేటెస్ట్ గా సినీ ఇండస్ట్రీపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈమె సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తన గ్లామర్ విషయంలో ఎన్నో భయాలుండేవట. సినిమాల్లో నార్మల్ లుక్ లో సింపుల్ గా కనిపించడానికే ఎక్కువగా ఇష్టపడతానని చెప్పింది.
ఈ క్రమంలోనే తన మొదటి సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు తన అందం గురించి విపరీతమైన ఆలోచనలు ఉండేవని.. వాటిపై ఒక క్లారిటీ లేక సతమతమయ్యేదాన్ని.. అని తెలిపింది. కాలేజ్ టైమ్ లోనే తాను సినిమాల్లోకి వచ్చానని సాయి పల్లవి తెలిపింది. సాధారణంగా సినిమాల్లో యాక్ట్ చేసే హీరోయిన్స్ కి ఫేస్ మీద మచ్చలు లేకుండా చక్కగా, అందంగా కనిపించేవారని పేర్కొంది.
కానీ తనకు ముఖం మీద ఎక్కువగా పింపుల్స్, మచ్చలు ఉన్నాయని, అందుకే తాను ఈ సినీ ఇండస్ట్రీలో సెట్ అవుతానా.. లేదా.. అని ఎన్నో రకాల ఆలోచనలు ఉండేవని సాయిపల్లవి తెలిపింది. ఈ విషయంలో తాను ఎన్నో సార్లు మానసికంగా బాధపడేదాన్నని.. ఒకవేళ సినిమాల్లోకి వెళ్ళాక.. ఈ హీరోయిన్ ఏంటి.. ఇలా ఉందంటూ.. కామెంట్స్ వస్తాయా.. అని అనుకునేదాన్నని తెలిపింది.
అయితే క్యారెక్టర్ కంటే పైకి కనిపించే అందాన్నే ఎక్కువగా ఇష్టపడతారు.. అనే విషయంపై తనకు స్పష్టత ఉందని సాయి పల్లవి వెల్లడించింది. కానీ మలయాళం ప్రేమమ్ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యాక తాను ఆలోచిస్తున్న విధానం చాలా తప్పని.. తనకు మరింత స్పష్టంగా తెలిసిందని చెప్పింది. ఎవరైనా సరే పైకి కనిపించే అందాన్ని కాకుండా.. క్యారెక్టర్ నే ఎక్కువగా అభిమానిస్తారని అర్థమై.. మనసు తేలిక పడిందని చెప్పింది. తన సినీ కెరీర్ కు ఆత్మవిశ్వాసాన్ని నింపిన సినిమా ప్రేమమ్ అని.. ఈ సినిమా వల్లే తనలో ఆత్మ విశ్వాసం నిండిందని.. ఆమె తెలిపింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…