RRR Movie : ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ.. ఆర్ఆర్ఆర్. ఈ సినిమా మార్చి 25వ తేదీన విడుదలై భారీ విజయాన్ని సాధించింది. విడుదలైన అన్ని చోట్లా భారీ స్థాయిలో కలెక్షన్లను వసూలు చేస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ మూవీకి రూ.1000 కోట్లకు పైగానే వచ్చాయి. సినిమాకు రూ.500 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల పాటు ఆర్ఆర్ఆర్ హవా కొనసాగుతుందని స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో అల్లూరి పాత్రలో రామ్ చరణ్ నటించగా.. ఎన్టీఆర్ భీమ్ పాత్రలో అలరించారు. ఈ ఇద్దరి నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
ఇక ఆర్ఆర్ఆర్ మేనియా ఇంకా కొన్ని రోజులు కొనసాగుతుందని తెలుస్తోంది. కానీ ఓటీటీ రిలీజ్ మాత్రం కాస్త ఆలస్యం అయ్యేట్లు కనిపిస్తోంది. అన్ని సినిమాల్లాగే అయితే ఇంకో నాలుగు రోజుల్లో ఈ మూవీ ఓటీటీల్లోకి వచ్చి ఉండాల్సింది. కానీ సినిమా హిట్ కావడంతో ఓటీటీలోకి రావడం ఆలస్యం కానుంది. అయితే ఇంకో నెల రోజులు ఓపిక పడితే చాలు.. ఆర్ఆర్ఆర్ ను ఓటీటీలో వీక్షించవచ్చని తెలుస్తోంది.
ఈ మూవీకి గాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు చెందిన డిజిటల్ హక్కులను జీ5 భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. దీంతో అదే యాప్లో ఈ మూవీ స్ట్రీమ్ కానుంది. ఇక హిందీ, విదేశీ భాషల హక్కులను మాత్రం నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ రెండు యాప్లలోనూ ఆర్ఆర్ఆర్ మూవీని స్ట్రీమ్ చేయనున్నారు. ఇక ఈ మూవీని జూన్ 3 నుంచి జీ5లో స్ట్రీమ్ చేస్తారని తెలుస్తోంది. ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారమే. ఇంకా దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కనుక ఆర్ఆర్ఆర్ మూవీ అసలు ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందో ఇంకా తెలియడం లేదు. కానీ జూన్ మొదటి వారంలో స్ట్రీమ్ అవుతుందని తెలుస్తోంది. ఇక దీనిపై త్వరలోనే అన్ని వివరాలు తెలియనున్నాయి.
నిధి అగర్వాల్ కెరీర్లో ఇటీవల భారీ బడ్జెట్ సినిమాలు ముఖ్యంగా హీరోయిన్లకు ఎంత ప్రమాదకరమో స్పష్టంగా చూపిస్తోంది. సినీ పరిశ్రమలో…
గూగుల్ తన కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్ గూగుల్ పిక్సెల్ 10ఎ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. పిక్సెల్ 10…
నటి రష్మిక మందన్న ఇప్పటివరకు తన వివాహంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా మౌనంగా వ్యవహరించింది. అయితే తాజాగా పాపరాజీతో…
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026 కు సంబంధించిన పూర్తి స్థాయి అధికారిక నోటిఫికేషన్ను…
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే ఆరోపణలు ఆంధ్రప్రదేశ్లో పెద్ద రాజకీయ, భావోద్వేగ చర్చకు తెరతీశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ…
మధుమేహంతో జీవిస్తున్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం పెద్ద సవాలే. అయితే రోజువారీ ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేస్తే…
భారత్తో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ బహిష్కరణపై చివరికి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. భారత్-పాకిస్థాన్ మధ్య…
మార్చి నెల బాక్సాఫీస్ పోరు నుంచి రెండు పెద్ద సినిమాలు తప్పుకోగా, ఆ స్థానాన్ని ఇప్పుడు పవర్ స్టార్ పవన్…