Bahubali 2 : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం బాహుబలి. ఈ సినిమాకి సీక్వెల్గా తెరకెక్కిన బాహుబలి 2 చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఇంటా బయటా ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి 2 సినిమా ఎక్కువగా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న పాయింట్తో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ క్రమంలోనే బాహుబలి 2 ఉత్తరాదిలో రూ.510 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా దరిదాపుల్లో ఇటీవల విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రాలు ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 లేకపోవడం విశేషం.
ఉత్తర భారతదేశంలో కేజీఫ్ 2 రూ.250 కోట్లు, ఆర్ఆర్ఆర్ రూ.321 కోట్లు రాబట్టాయి. అదే భాహుబలి2 విషయానికి వస్తే రూ.510 కోట్ల వసూళ్ళని రాబట్టింది. ఇక స్ట్రెయిట్ హిందీ చిత్రాల విషయానికి వస్తే భజరంగీ భాయిజాన్ రూ.320 కోట్లు, దంగల్ రూ.310 కోట్లు వసూలు చేశాయి. ఈ లెక్కలు చూస్తుంటే బాహుబలి 2కి ఉత్తరాదిలో ఎలాంటి ఆదరణ లభించిందో కూడా ఇది చూపిస్తుంది. బాక్సాఫీస్ గణాంకాల విషయానికొస్తే, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ ఇప్పటి వరకు రూ. 250 కోట్లు, రూ. 321 కోట్లను నికరంగా వసూలు చేశాయి. బాహుబలి 2 సంచలనాత్మకంగా రూ.510 కోట్లు నెట్ వసూలు చేసింది.
కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ కేజీఎఫ్ 2 చిత్రాన్ని కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్గా తీసుకొచ్చింది చిత్ర యూనిట్. అయితే కేజీఎఫ్ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ మూవీ మాస్ ఆడియెన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మాస్ చిత్రాలను ఇష్టపడే నార్త్ ఆడియెన్స్కు ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యింది. అలాగే కేజీఎఫ్ 2 కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఆర్ఆర్ఆర్ కూడా పలు రికార్డులని చెరిపేసింది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…