Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఎక్కడకు వెళ్లినా చాలా పద్దతిగా వ్యవహరిస్తుంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఆయన స్పెషాలిటీ. ఇటీవల రాజమౌళి తాను హుందాగా ఉండడానికి కారణం చిరంజీవి అని ఆయనపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవలి కాలంలో చిరంజీవి చాలా నాటీ కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్గా మారుతున్నారు. ఇటీవల తాప్సీ మిషన్ ఇంపాజిబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లిన చిరు ఆమెపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాప్సీతో నటించే ఛాన్స్ పోయిందంటూ ఓ రకమైన కామెంట్స్ చేశారు.
ఇక రీసెంట్గా ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్లో పూజా హెగ్డెపై తెగ ప్రేమ కురిపించారు. పూజ ఈజ్ సో క్యూట్. నా భార్య నిన్ను చూసినప్పుడల్లా.. ఓ రకంగా ప్రేమించేస్తుంటుంది. సురేఖ నీ నవ్వుకు పెద్ద ఫ్యాన్. నీ నవ్వు బాగుంటుంది అని ఎప్పుడూ నాతో చెబుతుంటుంది. ఈ మూవీలో రామ్చరణ్ కు జోడిగా చేశావ్ కానీ.. నాతో చేస్తే ఇంకా బాగుండేది.. అని చిరంజీవి అన్నారు. ఇక తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫోటో సెషన్ అప్పుడు చిరంజీవి.. పూజా హెగ్డెతో చాలా చిలిపిగా వ్యవహరించారు.
పూజా హెగ్డెని గట్టిగా హత్తుకోబోతున్నట్లు చేశారు. రామ్ చరణ్ ను పక్కన ఉండమని చెప్పి, పూజాతో వరుస ఫొటోలు కూడా దిగారు. ఈ వ్యవహారం చిరు యాంటీ ఫ్యాన్స్ కి నచ్చ లేదు. అందుకే తెగ ట్రోల్ చేస్తున్నారు. అయితే చిరులో ఉన్న ఫన్ సైడ్ ని అర్దం చేసుకోకుండా ఇలాంటి కామెంట్స్ ఏంటని కొందరు తిట్టిపోస్తున్నారు. ఇక ఏప్రిల్ 29న ఆచార్య విడుదల కానున్న నేపథ్యంలో కొద్ది రోజులుగా చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డె ప్రమోషనల్ కార్యక్రమాలలో తెగ యాక్టివ్గా పాల్గొంటున్నారు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…