Roja : రోజా.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన రోజా ఇప్పుడు బుల్లితెరపై సందడి చేస్తోంది. మరోవైపు రాజకీయాలలోను యాక్టివ్గా ఉంటోంది. ఇన్నాళ్లూ ఎంఎల్ఏగా ఉన్న రోజాకు మంత్రి పదవి దక్కింది. దీంతో ఆవిడ బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. రోజాకి హోదా మారడంతో జబర్ధస్త్, సినిమాల సంగతి ఏంటనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మంత్రి రోజా క్లారిటీ ఇచ్చారు.. జబర్ధస్త్తోపాటు సినిమాలకు కూడా దూరంగా ఉంటానని తెలిపారు. సీఎం జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు.
ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటు కావటంతో.. తిరుపతి జిల్లా నుంచి తనకు అవకాశం దక్కిందని చెప్పుకొచ్చారు. తాను యాక్టింగ్ చేయాలని చాలా మంది కోరుతున్నా.. ఇప్పుడు మంత్రిగా బాధ్యత పెరిగిందన్నారు. సీఎం జగన్ ఏనాడూ షూటింగ్ లు ఎందుకు చేస్తున్నావని అడగలేదని చెప్పారు. తాను ఏ రోజూ ఇతర నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోలేదని.. ప్రతిపక్షాల పైన మాత్రం రాజకీయంగా విమర్శలు చేస్తానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా తనను అసెంబ్లీలో చూడకూడదని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు అసెంబ్లీలో కనిపించడం లేదన్నారు. తనకు మంత్రిగా అవకాశం ఇవ్వడంతో టీడీపీతోపాటు తోక పార్టీకి ఎక్కడో కాలుతోందని వ్యాఖ్యానించారు.
ఒకప్పుడు జబర్ధస్త్ అంటే కంటెస్టెంట్స్ అందించే వినోదం పాటు జడ్జిగా ఉన్న నాగబాబు, రోజాల ఎనర్జిటిక్ స్మైల్స్ కూడా మంచి బూస్టప్ ఇచ్చేవి. కొన్ని కారణాల వల్ల నాగబాబు షో నుంచి తప్పుకున్నా.. రోజా మాత్రం తనకు అచ్చి వచ్చిన జబర్దస్త్ ను వదలలేదు. ఒక పక్క ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోపక్క జబర్దస్త్ షో పై అందంతో ఆకట్టుకుంటూనే ఉంది. ఎంతమంది జడ్జిలు వచ్చినా.. వెళ్లినా రోజా లేని జబర్దస్త్ను ఊహించుకోలేం.. అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…