Roja : మ‌ళ్లీ వివాదంలో చిక్కుకున్న రోజా.. అస‌లు ఏమైంది..?

Roja : గత కొంత కాలంగా  ఏపీ మంత్రులు వ‌రుస వివాదాల‌లో చిక్కుకుంటున్న విష‌యం తెలిసిందే. వారికి సంబందించి ఎన్ని వార్తలు వ‌చ్చినా కూడా ఎవ‌రు లెక్క‌చేయ‌డం లేదు. తాజాగా మంత్రి రోజా తిరుమల కేంద్రంగా విమర్శలకు కారణమయ్యారు. రోజా 30 మంది అనుచరులతో కల‌సి శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఆ అనుచరులలో పది మందికి టీటీడీ ప్రోటోకాల్ దర్శనం కల్పించిగా.. మరో 20 మంది అనుచరులకు బ్రేక్ దర్శనం అవకాశం కల్పించారు. తనతోపాటుగా వచ్చిన అనుచరులు స్వామివారి దర్శనం పూర్తి చేసుకొనే వరకూ మంత్రి రోజా ఆలయ ప్రాంగణంలోనే ఉన్నారు. మంత్రులతో వచ్చిన వారికి ముందుగా ప్రాధాన్యత ఇవ్వటం పైన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ వివాదంపై విమర్శలు సద్దుమణగ‌క‌ ముందే  రోజా మ‌రో వివాదంలో ఇరుక్కున్న‌ట్టు వార్తలు వెలువడుతున్నాయి.

మంత్రి రోజా మంగళవారం రాహుకేతు సర్పదోష నివారణార్థం శ్రీకాళహస్తి ఆలయానికి రావడం జరిగింది. ముక్కంటి దర్శనానికి ముందుగా మంత్రి రోజా సహస్రలింగేశ్వర సన్నిధి వద్ద రాహు కేతు దోష నివారణ పూజలు నిర్వహించడం జరిగింది. దోష నివారణ పూజ అనంతరం స్వామి వారికి నిర్వహించే రుద్రాభిషేక పూజలో పాల్గొన్నారు రోజా. అభిషేకం పూర్తి అయిన అనంతరం స్వామి అమ్మవార్లకు నిర్వహించే దీపారాధన పూజలో పాల్గొనడం జరిగింది. అనంతరం కాలభైరవ స్వామి వారికి అభిషేకం చేయించి, అభిషేక ఆరాధన జరుగుతున్న సమయంలో రోజా వెంట తెచ్చుకున్న గుమ్మడి కాయతో నేతి దీపాలు వెలిగించారు. అభిషేకం అయ్యే వరకు తనముందే దీపాలను ఉంచుకొని అభిషేకం అయ్యిన వెంటనే వాటిని అర్చకులకు అందించి హారతి ఇవ్వమని చెప్పారు.

Roja

ఇదంతా ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు ఉన్న సమయంలోనే జరగటం విశేషం. ఆలయ నిబంధనల ప్రకారం భూతనాధుడి ఆలయంలో ఆలయ అర్చకులు వెలిగించే దీపాలు మినహా, మిగతా భక్తులు ఎవరూ దీపాల‌ను వెంట తెచ్చుకోవ‌ద్దు అని అక్కడ నిబంధన ఉంటుంది. కానీ వీఐపీల విషయంలో అందుకు భిన్నంగా ఈ ఆచార వ్యవహారాలు కొనసాగుతున్నాయి. నిబంధనలకు వ్యతిరేకంగా మంత్రి రోజా తనతోపాటు దీపాలు తెచ్చుకున్నారు.  దక్షిణ కాశి క్షేత్రంగా పేరుగాంచిన శ్రీకాళహస్తి వాయులింగేశ్వర స్వామి ఆలయంలో నిబంధనలకు విరుద్ధంగా రోజా ప్రవర్తించారు. ఇదంతా కూడా ఆలయ నిబంధనలకు విరుద్ధమని తెలిసిన కూడా మంత్రి గానీ, అధికారులు, అర్చకులు గానీ పట్టించుకోలేదు. ఈ క్రమంలో మంత్రి రోజా చర్యలు తీవ్రవిమర్శలకు దారితీశాయి. ఆమెను తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. మ‌రి దీనిపై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM