Roja : గత కొంత కాలంగా ఏపీ మంత్రులు వరుస వివాదాలలో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. వారికి సంబందించి ఎన్ని వార్తలు వచ్చినా కూడా ఎవరు లెక్కచేయడం లేదు. తాజాగా మంత్రి రోజా తిరుమల కేంద్రంగా విమర్శలకు కారణమయ్యారు. రోజా 30 మంది అనుచరులతో కలసి శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఆ అనుచరులలో పది మందికి టీటీడీ ప్రోటోకాల్ దర్శనం కల్పించిగా.. మరో 20 మంది అనుచరులకు బ్రేక్ దర్శనం అవకాశం కల్పించారు. తనతోపాటుగా వచ్చిన అనుచరులు స్వామివారి దర్శనం పూర్తి చేసుకొనే వరకూ మంత్రి రోజా ఆలయ ప్రాంగణంలోనే ఉన్నారు. మంత్రులతో వచ్చిన వారికి ముందుగా ప్రాధాన్యత ఇవ్వటం పైన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ వివాదంపై విమర్శలు సద్దుమణగక ముందే రోజా మరో వివాదంలో ఇరుక్కున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.
మంత్రి రోజా మంగళవారం రాహుకేతు సర్పదోష నివారణార్థం శ్రీకాళహస్తి ఆలయానికి రావడం జరిగింది. ముక్కంటి దర్శనానికి ముందుగా మంత్రి రోజా సహస్రలింగేశ్వర సన్నిధి వద్ద రాహు కేతు దోష నివారణ పూజలు నిర్వహించడం జరిగింది. దోష నివారణ పూజ అనంతరం స్వామి వారికి నిర్వహించే రుద్రాభిషేక పూజలో పాల్గొన్నారు రోజా. అభిషేకం పూర్తి అయిన అనంతరం స్వామి అమ్మవార్లకు నిర్వహించే దీపారాధన పూజలో పాల్గొనడం జరిగింది. అనంతరం కాలభైరవ స్వామి వారికి అభిషేకం చేయించి, అభిషేక ఆరాధన జరుగుతున్న సమయంలో రోజా వెంట తెచ్చుకున్న గుమ్మడి కాయతో నేతి దీపాలు వెలిగించారు. అభిషేకం అయ్యే వరకు తనముందే దీపాలను ఉంచుకొని అభిషేకం అయ్యిన వెంటనే వాటిని అర్చకులకు అందించి హారతి ఇవ్వమని చెప్పారు.
ఇదంతా ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు ఉన్న సమయంలోనే జరగటం విశేషం. ఆలయ నిబంధనల ప్రకారం భూతనాధుడి ఆలయంలో ఆలయ అర్చకులు వెలిగించే దీపాలు మినహా, మిగతా భక్తులు ఎవరూ దీపాలను వెంట తెచ్చుకోవద్దు అని అక్కడ నిబంధన ఉంటుంది. కానీ వీఐపీల విషయంలో అందుకు భిన్నంగా ఈ ఆచార వ్యవహారాలు కొనసాగుతున్నాయి. నిబంధనలకు వ్యతిరేకంగా మంత్రి రోజా తనతోపాటు దీపాలు తెచ్చుకున్నారు. దక్షిణ కాశి క్షేత్రంగా పేరుగాంచిన శ్రీకాళహస్తి వాయులింగేశ్వర స్వామి ఆలయంలో నిబంధనలకు విరుద్ధంగా రోజా ప్రవర్తించారు. ఇదంతా కూడా ఆలయ నిబంధనలకు విరుద్ధమని తెలిసిన కూడా మంత్రి గానీ, అధికారులు, అర్చకులు గానీ పట్టించుకోలేదు. ఈ క్రమంలో మంత్రి రోజా చర్యలు తీవ్రవిమర్శలకు దారితీశాయి. ఆమెను తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరి దీనిపై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…