Jio : దేశంలోని టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అప్పట్లో జియో దెబ్బకు ఇతర టెలికాం కంపెనీలు బొక్క బోర్లా పడ్డాయి. ఒక జీబీ 4జి డేటాకు అప్పటి వరకు కంపెనీలు సుమారుగా రూ.250 వరకు వసూలు చేసేవి. కానీ జియో వచ్చాక ఆ ఖరీదు రూ.10కి పడిపోయింది. అలాగే ఉచిత కాల్స్, యాప్స్, జియో టీవీ, న్యూస్.. ఇలా అనేక సర్వీసులను ఒక్క జియో సిమ్తో ఉచితంగా పొందే వీలు కల్పించింది. దీంతో చాలా మంది కస్టమర్లు జియో వైపుకు మళ్లారు. అయితే మంది ఎక్కువైతే మజ్జిగ పలుచబడుతుందన్న చందంగా ఇప్పుడు జియో మారింది.
జియో సేవలు ఇప్పుడు మరీ అంత ఆకట్టుకునేలా లేవు. నెట్వర్క్ క్వాలిటీ కూడా తగ్గింది. అయినప్పటికీ ఇతర టెలికాం కంపెనీలకు పోటీగా నిలుస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త చందాదారులను చేర్పించుకుంటోంది. అయితే అప్పట్లో సృష్టించిన సంచలనం మాదిరిగా జియో మరో సంచలనానికి తెర తీయనుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే జియో త్వరలోనే 5జి సేవలను ప్రారంభించబోతుంది కాబట్టి.
దేశంలో ఇప్పటికే 5జి సేవలకు గాను స్పెక్ట్రమ్ వేలం ముగిసింది. ఇప్పటికే ఎయిర్టెల్తోపాటు జియో కూడా నెట్వర్క్ను వేగంగా విస్తరిస్తున్నాయి. పలు మొబైల్ తయారీ కంపెనీలతో ఒప్పందం చేసుకుని పలు చోట్ల 5జి సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నాయి. అయితే ఈ విషయంలో జియోతోపాటు ఎయిర్టెల్ కూడా కాస్త ముందు వరుసలోనే ఉంది. ఇక 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నేపథ్యంలో ముకేష్ అంబానీ జియో 5జి సేవలను ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు వార్తలు ఊపందుకున్నాయి.
దేశంలో 5జి స్పెక్ట్రమ్ వేలంలో జియో టాప్ బిడ్డర్గా నిలిచింది. 24,740 మెగా హెడ్జ్ స్పెక్ట్రమ్ను జియో రూ.88,078 కోట్లకు దక్కించుకుంది. ఇక దేశంలోని 22 సర్కిళ్లలో జియో తన 5జి సేవలను అందించనుంది. ఈ క్రమంలోనే ఆగస్టు 15న 5జి సేవలను ప్రారంభించడం ద్వారా జియో మరో సంచలనానికి తెర తీయనుందని తెలుస్తోంది. అదే జరిగితే ఈసారి జియో మరింత ముందుకు దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక జియో తరువాత ఎయిర్టెల్ 5జి సేవలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. మరి ఈ రెండింటిలో ఏ కంపెనీ ముందుగా 5జి సేవలను అందిస్తుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…