Anushka : కొన్ని సినిమాలు భారీ బడ్జెట్ తో నిర్మించి కలెక్షన్స్ రాబడితే.. మరికొన్ని సినిమాలు ఇటువంటి హంగులు ఆర్భాటాలు లేకుండా ప్రేక్షకులకు ముందుకు వచ్చి వారి హృదయాలలో మర్చిపోలేని స్థానాన్ని సంపాదించుకుంటాయి. అలా ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్న చిత్రాలలో వేదం మూవీ కూడా ఒకటి. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించగా అల్లు అర్జున్, మంచు మనోజ్ లు హీరోలుగా నటించి ప్రేక్షకుల మదిని దోచుకున్నారు.
ఇక ఈ సినిమాలో అనుష్క శెట్టి, దీక్షాసేత్, అతిథి గౌతమ్ హీరోయిన్స్ గా నటించారు . అంతే కాకుండా బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమా కమర్షియల్ సినిమాల కాకుండా డిఫరెంట్ గా కొందరి జీవితాలలో జరిగే యదార్థగాథలకు అనుగుణంగా పాత్రలను చిత్రీకరించడం జరిగింది. ఇక ఈ సినిమాలో అనుష్క క్యారెక్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో అనుష్క వేశ్య పాత్రలో నటించడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఈ సినిమాలో అనుష్క నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ఇక ఈ సినిమాలో అనుష్క పాత్రతో పాటు అనుష్కని అంటిపెట్టుకునే తిరిగే మరో క్యారెక్టర్ కనిపిస్తుంది. ఆ క్యారెక్టరే అనుష్క స్నేహితురాలు కర్పూరం. ఎప్పుడూ అనుష్క పక్కనే ఉండే హిజ్రా కర్పూరం పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమాలో బ్రహ్మానందంతో కర్పూరం చేసిన కామెడీ ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించింది. అంతే కాకుండా కర్పూరం కాల్పుల్లో గాయపడినప్పుడు ఉండే ఎమోషనల్ సన్నివేశం ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. ఈ కర్పూరం పాత్రలో నటించింది ఎవరు అన్న సంగతి మాత్రం చాలా మందికి తెలియదు.
మొదటిగా కర్పూరం పాత్రను దర్శకుడు క్రిష్ చేయాలని అనుకున్నారట. కానీ క్రిష్ తల్లి ఆ పాత్రలో నటించవద్దని హెచ్చరించడం జరిగిందట. అయితే అదే సమయంలో అనుష్క తన మేకప్ ఆర్టిస్ట్ నిక్కి ఫోటోలను క్రిష్ కు చూపించటం జరిగిందట. ఫొటోస్ తోపాటు కజ్ రారే పాటకు నిక్కి చేసిన డ్యాన్స్ వీడియోను కూడా క్రిష్ కు చూపించారట అనుష్క. ఆ వీడియో చూసి కర్పూరం పాత్రకు నిక్కి అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని క్రిష్ వెంటనే ఓకే చేయడం జరిగిందట. ఆ విధంగా నిక్కి వేదం చిత్రంలో కర్పూరం పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించారు.
తన వైవాహిక జీవితం ప్రస్తుతం ఎంతో సంతోషకరంగా ఉందని, భర్త మథియాస్ బో తనకు భారంగా అనిపించేలా ఎప్పుడూ ప్రవర్తించలేదని…
నటుడు అక్షయ్ కుమార్ గతంలో తనకు చెప్పిన మాటలు ఎంతో ప్రేరణగా నిలిచాయని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఇటీవల…
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్…
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్లో సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో భారత్ ఓడిపోవడం మంచిదేనని, తప్పులను…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఎడి సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతున్న కల్కి 2 చిత్ర షూటింగ్ ఫొటోను బాలీవుడ్…
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…