Rashmika Mandanna : ఇటీవలి కాలంలో చాలా మంది స్టార్స్ వివాదాస్పద ప్రకటనలలో నటిస్తూ నెటిజన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు. అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ వంటి వారు తాము చేసిన తప్పులని గ్రహించి క్షమాపణలు చెప్పారు. అల్లు అర్జున్ అయితే పొగాకు ప్రకటనలో నటించేందుకు ఆసక్తి కూడా చూపలేదు. డబ్బుల కోసం తప్పుడు ప్రకటనలు చేస్తే అభిమానుల ఆగ్రహానికి తప్పక గురవుతున్నారు. అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అయితే రష్మిక చేసిన యాడ్ ఇప్పుడు ఒకటి వివాదాస్పదంగా మారింది. ఆమె అభిమానులు రష్మికపై ఆగ్రహంగా ఉన్నారు.
నేషనల్ క్రష్గా మారిన రష్మిక ప్రస్తుతం సౌత్లోనే కాదు నార్త్లోనూ వరుస సినిమాలు చేస్తోంది. హిందీలో హీరోయిన్ రష్మిక మందన్నా క్రేజ్ మెల్లి మెల్లిగా పెరుగుతోంది. ఇప్పటికే సిద్ధార్థ్ మల్హోత్రా సరసన మిషన్ మజ్నులో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాతో బాలీవుడ్కు రష్మిక పరిచయం కాబోతుంది. వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది. అలాగే అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్ చేసిన డాడీ (ప్రజెంట్ టైటిల్) చిత్రంలో రష్మిక మరో లీడ్ క్యారెక్టర్ చేసింది. తండ్రీకూతుళ్ల బ్యాక్డ్రాప్లో రూపొందిన ఈ చిత్రానికి వికాస్ బాల్ దర్శకుడు. ఈ చిత్రం కూడా ఈ ఏడాదే రిలీజ్ కానుంది.
కాగా రష్మిక తాజాగా హీరో వరుణ్ ధావన్తో కలిసి కింగ్ ఫిషర్ సోడా యాడ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో శనివారం విడుదల కాగా.. దీనిపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యానికి హాని చేసేటువంటి వాటిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు.. అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకటనలో, వరుణ్ పాప్ స్టార్గా కనిపిస్తాడు, అతను వేదికపై తనతో కలిసి డాన్స్ చేయడానికి రష్మికను ఆహ్వానిస్తాడు. ఇద్దరూ కలిసి ఒక క్లబ్లో డ్యాన్స్ చేస్తూ, ఆ తర్వాత బీచ్లో కనిపిస్తారు. కింగ్ ఫిషర్ యాడ్ కోసం వీరిద్దరూ చేసిన రచ్చ కొంద మందికి నచ్చినా మరి కొందరు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…