Rashmi Gautam : తెలుగు ప్రేక్షకులకు బుల్లితెర యాంకర్లు, నటీనటుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిలో బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ కూడా ఒకరు. తన టాలెంట్ తో ఎంతోమంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ప్రజంట్ తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్స్ లో ఒకరిగా ఎదిగింది. అలాగే సినిమాల్లో కూడా నటిస్తూ.. తన హవా చాటుకుంటోంది. తన ఫ్యాన్స్ కి చేరువగా సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. ఎప్పటికప్పుడు తన ప్రొఫెషనల్ విశేషాలతోపాటు పర్సనల్ విషయాల్ని షేర్ చేసుకుంటోంది. అంతేకాదు సమాజంలో జరిగే పలు విషయాలపై స్పందిస్తోంది.
అలాగే ఎన్నో సందర్భాల్లోనూ.. ఎన్నో ఇంటర్వ్యూల్లోనూ తనకు మూగజీవాలంటే ప్రేమ అనే విషయాన్ని తెలిపింది. జంతువులపై దాడి చేసిన సందర్భాలలో వ్యక్తులపై కూడా రష్మీ రెస్పాండ్ అవుతోంది. ముఖ్యంగా జంతువులకు ఎలాంటి హానీ జరిగినా ఊరుకోదు. గతంలో కూడా కొన్ని వీధి కుక్కలపై జరుగుతున్న ట్రీట్ మెంట్ విషయంలో కూడా ఈమె రియాక్ట్ అయ్యింది. లేటెస్ట్ గా సోషల్ మీడియాలో రష్మీ పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ మరోసారి వైరల్ గా మారింది. దీపావళి వేడుకల్లో భాగంగా పశ్చిమ బెంగాల్ లో దారుణం చోటు చేసుకుంది.
అందరూ ఎకో ఫ్రెండ్లీ దీపావళి సెలెబ్రేట్ చేసుకుంటుండగా, కొంతమంది సైకోలు ఓ వీధి కుక్కను దారుణంగా హింసించారు. కుక్క తోకకు టపాసులు కట్టి పేల్చారు. ఆ దాడితో కుక్క కాలుకు గాయాలై.. తోక తెగిపోయింది. దీంతో స్థానికులు స్పందించి.. ఆ కుక్కను హాస్పిటల్ కు తీసుకెళ్ళి ట్రీట్ మెంట్ చేయించారు. ఆ కుక్క పరిస్థితి మెరుగ్గా ఉందని డాక్టర్లు తెలిపారు.
ఇక ఈ ఘటనపై యాంకర్ రష్మీ గౌతమ్ ఓ పోస్ట్ చేసింది. మానవత్వం చచ్చిపోయింది.. ఈ భూమిపై మానవజాతి అంతరించే సమయం వచ్చింది అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేసింది. ఈ ఘటనపై నెటిజన్లు కూడా ఆ సైకోలను శిక్షించాలని కోరుతున్నారు.
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్దీప్ సింగ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి…
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…