Ram Gopal Varma : వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక అంశంపై లేదా వ్యక్తులపై వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. అవి వివాదాస్పదం అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే వర్మ ఇటీవలి కాలంలో సినిమాల కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువగా కాలం గడుపుతున్నారు. ఇక తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోమారు వివాదాస్పదం అవుతున్నాయి. పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్ర ట్రైలర్ను మేకర్స్ విడుదల చేయగా.. దీనిపైనే వర్మ వ్యాఖ్యలు చేశారు.
పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో మొత్తం రానానే కనిపిస్తాడని అన్నారు. పవన్ ట్రైలర్ లాంటివాడని, రానా సినిమా లాంటి వాడని అన్నారు. ఇక భీమ్లా నాయక్ను హిందీలో రిలీజ్ చేస్తే అక్కడి ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతారని.. విలన్ ఎవరో గుర్తు పట్టలేరని.. ఎందుకంటే సినిమా మొత్తం రానా కనిపిస్తాడని.. రానా బాహుబలి ద్వారా హిందీ ప్రేక్షకులకు ఇప్పటికే తెలుసు కాబట్టి.. ఈ సినిమాలో రానాను చూసి అతన్నే హీరోగా ప్రేక్షకులు భావించే అవకాశం ఉందని అన్నారు.
ఇక మళయాళంలో హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికి రీమేక్గా భీమ్లా నాయక్ను తెరకెక్కించిన విషయం విదితమే. ఈ చిత్రం కోసం పవన్కు అనుగుణంగా, తెలుగు నేటివిటీకి తగినట్లుగా కథలో త్రివిక్రమ్ పలు మార్పులు చేశారు. అయితే దీనిపై కూడా వర్మ కామెంట్లు చేశారు. పవన్ కోసం కథలో ఎన్ని మార్పులు చేసినా.. సినిమా మొత్తం రానానే కనిపిస్తాడని అన్నారు. ఈ క్రమంలోనే వర్మ కామెంట్లు పవన్ ఫ్యాన్స్కు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…