Radhe Shyam : ప్రభాస్, పూజా హెగ్డెలు హీరో హీరోయిన్లుగా నటించిన రాధే శ్యామ్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే సంక్రాంతికి విడుదల కావల్సి ఉన్న ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది ఫ్యాన్స్కు ఎంతో సంతోషాన్నిస్తోంది. ఎప్పటి నుంచో రాధే శ్యామ్ విడుదల కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ ఎట్టకేలకు విడుదలవుతుండడం వారికి అంతులేని ఆనందాన్ని అందిస్తోంది.
రాధే శ్యామ్ చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని, ఓటీటీలో రిలీజ్ చేసే ప్రసక్తే లేదని మేకర్స్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఈ మూవీని మార్చి 11, 2022వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయినందున ఇక సినిమాను ఆపడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని, కనుక ఎట్టి పరిస్థితిలోనూ మార్చి 11న ఈ సినిమాను విడుదల చేయాల్సిందేనని ప్రభాస్ కచ్చితంగా చెప్పేశారట. అందుకని మేకర్స్ ఆ తేదీని లాక్ చేసేశారు. దీంతో ఆ తేదీన కచ్చితంగా మూవీ విడుదల అవుతుందని తెలుస్తోంది.
కాగా రాధే శ్యామ్ విడుదల తేదీపై ప్రభాస్తోపాటు టి-సిరీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు తీవ్రంగా చర్చించారు. గతంలోనూ ఈ మూవీ విడుదలపై అనేక సందేహాలు నెలకొనగా.. వాటిని మేకర్స్ పటాపంచలు చేసేశారు. ఎట్టేకలకు రాధే శ్యామ్ విడుదల అవుతుండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక మార్చి 11వ తేదీ సమయంలో ఎలాంటి పాన్ ఇండియా సినిమాలు విడుదల కావడం లేదు. దీంతో ఆ తేదీ కలసి వస్తుందని రాధే శ్యామ్ మేకర్స్ భావిస్తున్నారు. ఢిల్లీలోనూ కర్ఫ్యూను ఎత్తివేశారు. అటు ఏపీలో ఫిబ్రవరి నెలలో సినిమా థియేటర్ల టిక్కెట్ల ధరలపై ఒక స్పష్టత వస్తుంది. కనుక అన్ని విధాలుగా మార్చిలో సినిమాను విడుదల చేయడమే కరెక్ట్ అని రాధే శ్యామ్ మేకర్స్ భావించారు. కనుక మార్చి 11 డేట్ను సినిమా విడుదలకు లాక్ చేసేశారు.
కాగా రాధే శ్యామ్ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిచారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్స్, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దీంతో సినిమా హిట్ పక్కా.. అని భావిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…