IPL 2021 : దుబాయ్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 2021 టోర్నీ 45వ మ్యాచ్లో పంజాబ్ గెలుపొందింది. కోల్కతా నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ సునాయాసంగానే ఛేదించింది. ఈ క్రమంలో కోల్కతాపై పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ ముందుగా ఫీల్డింగ్ చేయగా కోల్కతా బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో కోల్కతా 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కోల్కతా బ్యాట్స్మెన్లలో వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి మాత్రమే రాణించారు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేదు. 49 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్తో వెంకటేష్ అయ్యర్ 67 పరుగులు చేయగా, 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్తో రాహుల్ త్రిపాఠి 34 పరుగులు చేశాడు. అలాగే 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో మరో బ్యాట్స్మన్ నితీష్ రాణా 31 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా, రవి బిష్ణోయ్ 2 వికెట్లు తీశాడు. మహమ్మద్ షమీకి 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన పంజాబ్ సులభంగానే లక్ష్యాన్ని ఛేదించింది. 19.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాట్స్మెన్లలో కేఎల్ రాహుల్ 55 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 67 పరుగులు చేయగా, మయాంక్ అగర్వాల్ 27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేదు. కోల్కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీయగా, శివమ్ మావి, సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్లకు తలా 1 వికెట్ దక్కింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…